IND vs AUS Test, Virat Kohli vs Nathan Lyon: 2023లో తమ మొదటి టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు సర్వం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. టీమ్ ఇండియా ఈ సిరీస్‌ని సొంతగడ్డపై ఆడనుంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో సిరీస్‌ ప్రారంభం కానుంది.


ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలిసారిగా రోహిత్ శర్మ భారత జట్టు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్‌లో జరిగే ఈ సిరీస్‌లో స్పిన్ బౌలర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ భారత జట్టుకు కొంచెం ఇబ్బందికరంగా మారవచ్చు. టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, నాథన్ లియాన్‌ల మధ్య గణాంకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.


నాథన్ లియాన్‌పై విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేశాడు?
టెస్ట్ క్రికెట్‌లో నాథన్ లియాన్ ఇప్పటివరకు విరాట్ కోహ్లీకి మొత్తం 782 బంతులు వేశాడు. ఇందులో కోహ్లీ 58.6 సగటు, 52.4 స్ట్రైక్ రేట్‌తో 410 పరుగులు చేశాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీకి నాథన్ లియాన్ మొత్తం 514 డాట్ బాల్స్ విసిరాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లలో నాథన్‌ లియాన్‌పై విరాట్ కోహ్లీకి మాత్రమే అత్యుత్తమ సగటు ఉంది.


నాథన్ లియాన్‌ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఎన్ని బౌండరీలు కొట్టాడు?
టెస్టు క్రికెట్‌లో ఆడుతున్నప్పుడు నాథన్ లియాన్‌ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 36 ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు.


విరాట్ కోహ్లిని నాథన్ లియాన్‌ ఎన్నిసార్లు అవుట్ చేశాడు?
టెస్టుల్లో ఇప్పటి వరకు నాథన్ లియాన్ ఏడు సార్లు విరాట్ కోహ్లీకి పెవిలియన్ దారి చూపించాడు. 2013లో మూడుసార్లు, 2014లో ఒకసారి, 2017లో ఒకసారి, 2018లో రెండుసార్లు నాథన్ లియాన్ వలలో పడి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం జరిగే సిరీస్‌లో కూడా వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన పోరు కనిపించనుంది.


ఈ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరగనుంది. ఈ మైదానంలో విరాట్ కోహ్లి రికార్డు మామూలుగా లేదు. కోహ్లి ఇక్కడ మూడు మ్యాచ్‌ల్లో 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుండి రెండు సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా వచ్చాయి. అందులో కోహ్లీ ఒక ఇన్నింగ్స్‌లో 213 పరుగులు కూడా చేశాడు.


మరోవైపు టెస్టు ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ రికార్డు కూడా ఆకట్టుకుంది. కంగారూ జట్టుతో ఆడిన 20 టెస్టు మ్యాచ్‌ల్లో 48.06 సగటుతో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 1,682 పరుగులు చేశాడు. అదే సమయంలో, అతని బ్యాట్ నుంచి ఏడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు కూడా వచ్చాయి.


2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ మధ్య ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక మూడో టెస్టు మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 5వ తేదీ దాకా ధర్మశాలలో జరగనుంది. మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ దాకా అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.