శుక్ర మౌఢ్యం:  పెళ్లికాని ప్ర‌సాద్‌ల‌కు బ్యాడ్ న్యూస్‌.. చాలా మంది పెళ్లెప్పుడు అంటే ఏడాది ఆఖ‌రి మాసంలో చేసుకుంటున్నా అంటూ కొంత‌మంది.. వ‌చ్చే ఏడాది మొద‌టి నెల‌లోనే పెళ్లి బాజా పెట్టేస్తా అని మ‌రికొంత మంది చెప్పు కొస్తుంటారు.. అలా చెప్పేవారికి, ఏడాది ఆఖ‌రి మాసంలో, ఏడాది మొద‌టి మాసంలో వివాహాలు చేసుకునేవారికి ఇది  బ్యాడ్ న్యూస్ ... హైంద‌వ సంప్ర‌దాయాల్లో ముహూర్తానికి ఉన్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు.. ముహూర్తం నిర్ణ‌యించ‌నిదే ఎటువంటి శుభ‌కార్య‌క్ర‌మాల‌కు పూనుకోరు.. తాము త‌ల‌పెట్టిన ప‌ని అంతా స‌జావుగా, సంతృప్తిగా జ‌ర‌గాలంటే ముహూర్తం చాలా ముఖ్యం అంటుంటారు.. అందుకే ప్ర‌తీ శుభ‌కార్య‌క్ర‌మాల‌కు ముహూర్తానికి అంత‌టి ప్రాధాన్య‌త‌నిస్తారు.. గురుబ‌లం బాగుంటేనే గ్ర‌హ‌చారం బాగుండేది.. సాధారణంగా శుభకార్యాలు నిర్వహించాలంటే గురు బలం బాగా ఉండాలి. అలాగే సిరిసంపదలు, సంతోషాలకు శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. అయితే మూఢమి సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా తేజస్సు కోల్పోయి ఉంటాయి.. కాబట్టి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అంటుంటారు..అందుకే ఈ మూఢ‌మి ఉన్న‌న్నాళ్లూ ఎటువంటి శుభ‌కార్యాలకు పూనుకోరు... అందుకే మీ అబ్బాయి పెళ్లెప్పుడు అని గ‌నుక అంటే శూన్య మాసం క‌దండీ.. మూఢం వెళ్లాక ముహూర్తాలు పెట్టేస్తాం అంటుంటారు.. అస‌లు మూఢ‌మి అంటే ఏమిటి.? మూఢమి అంటే శూన్యం లేదా చీకటి అని అర్థం. గురుడు లేదా శుక్రడు సూర్యుడితో కలిసి ఉండే కాలాన్ని మౌఢ్యమి అంటారు. దీనినే వాడుక భాషలో ఆయా ప్రాంతాలను బట్టి మూఢమి లేదా మూఢం అని అంటుంటారు. నవగ్రహాల్లోని గురుడు, శుక్రుడు గమనం చేస్తున్న క్రమంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అవి తమ కాంతిని కోల్పోవడం ద్వారా చీకటి లేదా మూఢమి సంభవిస్తుంది. దీనినే శూన్యం అనికూడా అంటుంటారు..  ఇంకా వివరంగా చెప్పాలంటే సౌర కుటుంబానికి సూర్యుడు పెద్దగా చెబుతారు. సూర్యుడి శక్తి, కాంతి అనంతం. అలాగే గురుడు, శుక్రుడు ఇవి రెండూ శుభ గ్రహాలు. ఈ శుభ గ్రహాలు మూఢమి సమయంలో తమ తేజస్సును కోల్పోవడం వల్ల.. చీకటి రోజులుగా భావించి శుభకార్యాలను వాయిదా వేస్తుంటారు. అందుకే ఈ మూఢమి ఉన్నన్ని రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. మూఢం ఎప్ప‌టినుంచి అంటే.. ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీ నుంచి శుక్ర మౌడ్యమి (గురుడు, శుక్రుడు అస్తంగత్వం) ఏర్పడనుందని పండితులు చెబుతున్నారు. అంటే డిసెంబ‌ర్ ఎనిమిది నుంచి 2026 ఫిబ్రవరి 6 వ తేదీ వరకు ఈ శుక్ర మౌఢ్యమి కొనసాగుతుంది. అంటే సుమారు 61 రోజుల పాటు ఈ మూఢం ఉండ‌నుంది.  శ్రీవిశ్వావసు నామ సంవత్సరం మార్గశిర బహుళ చవితి నుంచి మాఘమాసం బహుళ పంచమి వరకు ఈ శుక్ర మౌడ్యమి కొన‌సాగుతుంది.. ఈ శుక్ర మౌడ్యమి లో వివిధ పంచాంగాల్లో గణితాలలో తేడా వల్ల సూర్య గమనానికి దగ్గరగా గురుడు గాని శుక్రుడు గాని రావడం మూలంగా శుక్ర మౌడ్యమి గాని గురు మౌడ్యమి గాని ఏర్పడుతుంది. కొంతమంది 12 డిగ్రీలు గాను కొంతమంది 10 డిగ్రీలు గాను కొంతమంది 8 డిగ్రీలు గాను గ్రహించడం వల్ల ఈ తేదీలలో తేడాలు వస్తున్నాయి. కచ్చితంగా భారత ప్రభుత్వ ఆమోదిత దృక్ గణితము గ్రహించడం శాస్త్ర సమ్మతము..కనుక ఈ శుక్ర మౌడ్యమిలో వివిధ పంచాంగాల్లో వివిధ రకాలుగా డేట్లు రావడం జరిగిందంటున్నారు. మూఢమి సమయంలో చేయకూడని పనులు.. ఈ మూఢమి సమయంలో పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహం, ఉపనయనం, నూతన గృహప్రవేశం, యజ్ఞాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠలు, వాహనం, ఇల్లు వంటివి కొనడం, బోర్లు వేయించడం, పుట్టువెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, తీర్థయాత్రలకు వెళ్లడం,కొత్త ప్రయాణాలు ప్రారంభించడం, పదవీ ప్రమాణ స్వీకారం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ పనులు చేయొచ్చు.! మూఢ‌మి ఉన్నా యథాతథంగా జరుపుకునే వాటిలో సీమంతం, నూతన వస్త్రాలంకరణ వంటి వాటికి ఈ మూఢమి వర్తించదు. ఈ కార్యక్రమాలకు నమ్మకమైన పండితులను సంప్రదించి నిర్వహించుకోవచ్చంటున్నారు పండితులు. అలాగే కొన్ని అనివార్యమైన, నిత్య కర్మలకు ఈ మూఢమి దోషం వర్తించదు. వాటిలో ప్రధానంగా రోజువారీ ప్రయాణాలు, నిత్యపూజ, అభిషేకం, నవగ్రహ శాంతి, సీమంతం, నామకరణం, అన్నప్రాశన వంటి కార్యక్రమాలు, చాతుర్మాస్య వ్రతాలు వంటివి ఈ శుక్ర మౌఢ్యమి రోజుల్లో వచ్చినా కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చంటున్నారు.. ప్ర‌ముఖ పంచాంగ కర్త ఉపద్రష్ఠ నాగాదిత్యాన్... 

Continues below advertisement

Continues below advertisement