Mahashivratri 2026: 6 నెలలు రాత్రివేళ నగ్నంగా ఓ శిల్పి నిర్మించిన శివాలయం ఇదే! అకస్మాత్తుగా ఆ శిల్పి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?
Shiva Temple: ఆరు నెలల పాటూ రోజూ చీకటి పడగానే శివాలయం నిర్మించేపనిలో పడేవాడు శిల్పి. ఓ రోజు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు? అసలేం జరిగింది? ఎక్కడుందా ఆలయం?

Mahashivratri 2026: ఛత్తీస్గఢ్లో ఉన్న ఆ గ్రామంలో మహాశివరాత్రి వేళ రెండు రోజుల పాటూ ఉత్సవం జరుగుతుంది. ఆలయంలో కొలువైన శివయ్యను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.

లక్షలాది భక్తులను ఆకర్షించే ఈ ఆలయం గోపురం మాత్రం సగమే పూర్తైంది. మిగిలిన భాగం అలాగే ఉండిపోయింది. ఎందుకు అని అడిగితే.. దీనకి సంబంధించి ఓ కథను చెబుతారు స్థానికులు
ఛత్తీస్గఢ్ దుర్గ్ జిల్లా దేవ్బలోడా గ్రామంలో 14వ శతాబ్దానికి చెందిన పురాతన శివాలయం ఇది. మహాశివరాత్రి నాడు దూర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి నాడు ఇక్కడ రెండు రోజుల పాటు భారీ ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే దీనిని కల్చురి కాలం నాటి రాజులు నిర్మించారు..అందులో శివలింగం భూగర్భం నుంచి ఉద్భవించింది. ఈ ఆలయం ఒకే రాయితో నిర్మించారు

ఈ ఆలయాన్ని ఆరు నెలల పాటూ ఒకే వ్యక్తి నిర్మించాడని స్థానికులు చెబుతారు. ప్రతి రోజూ నిర్మాణం ప్రారంభించేముందు సమీపంలోని చెరువులో స్నానం చేసే ఆ తర్వాత నగ్నంగా నిర్మాణపనులు ప్రారంభించేవాడట. అత్యంత పవిత్రంగా స్వామివారి ఆలయం నిర్మించాలన్నది ఆ వ్యక్తి ఉద్దేశం. ఆ కళాకారుడి భార్య కూడా నిర్మాణ పనిలో భర్తకు సహకరించేది. నిత్యం అతడికి వంట చేసి ఆహారం తీసుకెళ్లేది. ఓ రోజు రాత్రి ఆ శిల్పి నిర్మాణపనుల్లో మునిగి ఉండగా..నిత్యం భోజనం తీసుకొచ్చే భార్య బదలు ఆయన సోదరి వచ్చిందట. ఆ క్షణం సిగ్గుతో ఆలయ ప్రాంగణంలో ఉన్న చెరువులో దూకేశాడు. అప్పటి నుంచి ఆ శిల్పి ఆచూకీ కూడా దొరకలేదట. అలా గోపుర నిర్మాణం సాగుతుండగా ఆ శిల్పి మరణించడంతో గోపురం పూర్తికాలేదని చెబుతారు

గోపురం సగం పూర్తైన పురాతన ఆలయంలో అద్భుత కళాఖండాలున్నాయి. 14వ శతాబ్దంలో ప్రజలు ఎలా జీవించారో ప్రతిబింబించేలా దేవుళ్ళు, దేవతల చిత్రాలు ఆలయం అంతటా కనిపిస్తాయి. త్రిశూలంతో తాండవం చేస్తున్న శివుడు, రెండు ఎద్దులు పోరాడుతున్న దృశ్యాలు సహా ఇలాంటి అనేక ఇతర కళాకృతులు ఉన్నాయి.

ఆలయ ప్రాంగణం లోపల ఉన్న చెరువులో నీరు ఎప్పుడూ ఎండిపోదని, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదని చెబుతారు. ఛత్తీస్గఢ్లోని ఆరంగ్ జిల్లాలో ఎక్కడో దారితీసే చెరువు లోపల ఒక సొరంగం ఉందని ప్రజలు నమ్ముతారు. అయితే, ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే.. దీనికి శాస్త్రీయ పురావస్తు ఆధారాలు ఇంకా కనుగొనలేదు. చెరువు లోపల పెద్ద చేపలు తాబేళ్లు కనిపిస్తున్నాయి. బంగారు ఉంగరం ధరించిన చేప ఈ చెరువులోనే ఉందని నమ్మకం.

చాలా సంవత్సరాలుగా ఆలయ ప్రాంగణంలో జంటపాములు కనిపిస్తున్నాయని.. అవి కొన్నిసార్లు శివుని శివలింగం చుట్టూ చుట్టి దర్శనమిస్తాయని , అవి ఇంతవరకూ ఏ భక్తులకు హాని చేయలేదని స్థానికులు చెబుతారు. ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి నాడు ఇక్కడ ఒక భారీ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని దేవబలోద ఉత్సవం అని కూడా పిలుస్తారు. ఆ రోజున సుదూర ప్రాంతాల నుంచి భక్తులు శివుడిని పూజించడానికి వస్తారు . ఈ ఉత్సవం రెండు రోజుల పాటు కొనసాగుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
























