Prasad Benefits: హిందూ సనాతన సంప్ర‌దాయంలో దేవతలకు నైవేద్యం సమర్పించి ప్రసాదం రూపంలో స్వీక‌రించే సంప్రదాయం ఉంది. భగవంతుని ప్రసాదం స్వీక‌రించ‌డం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. అందుకే చాలామంది దానిని ఆహారంగా భావిస్తారు. మనం గుడికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా దైవ సంబంధిత‌ కార్యక్రమం జరిగినప్పుడు, భ‌గ‌వంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసా..? భగవంతుని ప్రసాదం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.


మ‌న‌స్సు స్వచ్ఛంగా, ప్రశాంతంగా మారుతుంది
భగవంతుని ప్రసాదం స్వీక‌రించ‌డం వల్ల మనస్సు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. సాధారణంగా ఇతర ఆహారాల కంటే ప్రసాదం తక్కువగా తింటారు, కానీ అది మనకు రెట్టింపు సంతృప్తిని ఇస్తుంది.


Also Read : రోజూ గుడికి వెళితే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే - మీరు అస్సలు ఊహించలేరు


సానుకూల సంకేతాలు
ప్రసాదం తీసుకోవడం వల్ల మనసులోను, మెదడులోనూ సానుకూల భావోద్వేగాలు ఏర్పడతాయి. భగవంతుడికి సమర్పించే నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల భగవంతునితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది.


పోషకాలను అందిస్తుంది
ప్రసాదం మన మనస్సులో భగవంతుని పట్ల భక్తిని మరియు విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలను అందించే వేల రకాల ప్రసాదాలు ఉన్నాయి. ప్రసాదం అన్ని రకాల పోషకాలను కలిగి ఉండటం వల్ల మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పంచామృత ప్రసాదం, చరణామృత ప్రసాదం, బెల్లం, మినుము, కొబ్బరి, తులసి ఇతర వంటకాలతో కలిపి తింటే రోగాలు నయమవుతాయి.


ప్రసాదం పంచితే ప్రేమ పెరుగుతుంది
మనం నిత్యం భగవంతుని ప్రసాదాన్ని ఇతరులకు అందజేయ‌డం వ‌ల్ల‌, మీ పట్ల ప్రజలు కూడా మంచి అభిప్రాయాన్ని పెంపొందించుకుంటారు. దీని వల్ల ఎవరి మనసులోనూ మీ పట్ల ఎలాంటి అనుబంధం లేదా ద్వేషం ఏర్పడదు. దేవుని పట్ల ప్రేమ కూడా మీ హృదయంలో ఉంటుంది.


మీరు దైవత్వాన్ని అనుభవిస్తారు
భగవంతునితో నిరంతరం అనుసంధానం కావ‌డం ద్వారా, మనస్సు స్థితి, దిశ మారుతుంది. దీని ద్వారా మీరు దైవత్వాన్ని అనుభవిస్తారు. జీవితంలో ఎదుర‌య్యే కష్టాలను ఎదుర్కొన‌డానికి అవ‌స‌ర‌మైన మ‌నో బలాన్ని పొందుతారు. దేవతలు కూడా కష్ట సమయాల్లో మీతో కలిసి ఉంటారు.


Also Read : మాంసాహారం తిన్న త‌ర్వాత‌ గుడికి ఎందుకు వెళ్లకూడదో తెలుసా..?


స్వర్గ ప్రాప్తి
శ్రీమద్ భగవద్గీత ప్రకారం, భ‌గ‌వంతునికి నైవేద్యాన్ని సమర్పించడం, అనంత‌రం ఇతరులకు దానం చేయడం ద్వారా మనకు స్వర్గంలో నివాసం లభిస్తుంది. అలాగే, దేవతల నివాసానికి వెళ్లి, అంటే దేవతలను పూజించి, వారికి నైవేద్యం స‌మ‌ర్పించి, ఆ త‌ర్వాత ప్రసాదం తిని, ఇంటికి చేరుకున్న వారికి పునర్జన్మ ఉండ‌దని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.