Is he a ghost: ష్..! గట్టిగా మాట్లాడకు 'రంగధరి' మేల్కొంటుంది? ఈ ఆత్మకు పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారెందుకు?
Rangadhari: బీహార్ , తూర్పు ఉత్తరప్రదేశ్ గ్రామాల్లో భిన్నమైన విశ్వాసం కనిపిస్తుంది. బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన గోసైన్ గృహాల్లో, దేవతలతో పాటు, పీర్ బాబాను, రంగధరి అనే ఆత్మను పూజిస్తారు.

Rangadhari : సాధారణంగా ఇంట్లో పూజా మందిరంలో భగవంతుడి విగ్రహాలు, ఫొటోలు ఉంటాయి. నిత్యం పూజలు చేస్తారు, నైవేద్యాలు సమర్పిస్తారు. నిత్యం పూజలు చేయకపోయినా...పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక రోజుల్లో దేవుడి మందరాన్ని అందంగా అలంకరిస్తారు. అయితే బీహార్ , తూర్పు ఉత్తరప్రదేశ్లోని చాలా గ్రామాల్లో, నగరాల్లో అనుసరించే ఆచారాలు, పూజా విధానాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవుడి మందిరంలో పాలరాయి విగ్రహాలుండవు, హిందువులు పూజించే దేవుళ్ల చిత్ర పటాలు కనిపించవు. పూజా మందిరంలో చిన్న మట్టి విగ్రహాలు కనిపిస్తాయి...వాటికే పూజలు చేస్తారు
బీహార్ లో ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన గోసాయి ఇంట్లో ఇలాంటి దృశ్యమే కనిపించింది. దేవుళ్ల చిత్రాలు లేదా క్యాలెండర్లు లేవు, బదులుగా గుండ్రని మట్టి విగ్రహాలను ఉంచారు. వెర్మిలియన్తో అద్ది ఉన్న ఒక విగ్రహాన్ని శీతల మాత అని పిలుస్తారు. సమీపంలో ఒక మందిరం లాంటి నిర్మాణం ఉంది, ఇది "పీర్ బాబా" స్థలం అని కుటుంబ సభ్యులు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో, హిందూ కుటుంబాలు కూడా స్థానిక పీర్ లేదా బాబాను ఇంటి సంరక్షకుడిగా పరిగణించడం సర్వసాధారణం.

'రంగధరి' ఎవరు?
ప్రార్థన గదిలో ఒక మూలలో నల్ల తిలకంతో అలంకరించిన విగ్రహం ఉంది కదా..ఆ విగ్రహమే రంగధరి అంటే. తరతరాలుగా ఉన్న నమ్మకాల ప్రకారం..రంగధరి అంటే భయంకరమైన దయ్యం కాదు...ఇంటిని , పొలాన్ని రక్షించే మంచి ఆత్మ.
ఇది ఒక వాండరింగ్ సోల్ లేదా పూర్వీకులు ఇంటికి తీసుకొచ్చిన రక్షకుడిగా భావిస్తారు. ఇది భయపెట్టే దెయ్యం కాదు, కాపాడే రక్షణనిచ్చే ఆత్మగా చూస్తారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి స్థానిక ఆచారాలు సాధారణం. హిందూ, సూఫీ, స్థానిక నమ్మకాల మిశ్రమం ఇది. కొన్ని కుటుంబాల్లో పూజా గదిలో చిన్న సమాధి లాంటి నిర్మాణం ఉంటుంది. దానిని రంగధరి అని పిలుస్తారు. ఇక్కడ గట్టిగా మాట్లాడకూడదు...గట్టిగా మాట్లాడితే ఆ ఆత్మ మేల్కొంటుందని కుటుంబ పెద్దలు చెబుతారట..అందుకే పూజా మందిరంలోకి పిల్లలు రాగానే... ష్...గట్టిగా మాట్లాడకు రంగధరి మేల్కొంటుంది అని చెబుతారు.
నమ్మకాల ప్రకారం, ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే, పశువులు అనారోగ్యానికి గురైతే లేదా పంట దెబ్బతిన్నట్లయితే, గోసాయి ఇంటికి వెళ్లి రంగధరిని ప్రార్థించి ప్రసాదం తీసుకుంటారు. రంగధరి ప్రసాదం తీసుకుంటే అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని అక్కడి గ్రామణీలు విశ్వాసం. రంగధరికి పెట్టే నైవేద్యాలకు సంబంధించి నిర్దిష్ట నియమాలు ఉన్నాయి. వివాహితులైన కుమార్తెలు రంగధారికి సమర్పించిన నైవేద్యాలను స్వీకరించడానికి అనుమతిలేదు.
ఒకానొక సమయంలో, నిరంతరం సమస్యలు తలెత్తుతున్నప్పుడు...రంగధరి కుటుంబానికి చెందిన పెద్ద ప్రార్థన గదికి వెళ్లి తన అసంతృప్తిని వ్యక్తం చేసి, పరిస్థితిని చక్కదిద్దమని రంగధరిని ప్రార్థించారట. ప్రజాదరణ పొందిన నమ్మకం ప్రకారం, దీని తర్వాత పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభించాయి. అప్పటి నుంచి తరతరాలుగా రంగధరి పూజలు చేస్తున్నారు..సమస్యలు వస్తే చెప్పుకుని అక్కడి నుంచి ప్రసాదం తీసుకుంటున్నారు.
గోసాయి ఘర్ వంటి ప్రార్థనా స్థలాలు కేవలం మతపరమైన ప్రదేశాలు మాత్రమే కాదు, కుటుంబ చరిత్ర , నమ్మకాలలో భాగం. అవి ఒక దేవత, పీర్ బాబా, సంరక్షక ఆత్మకు నిలయం
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
























