అన్వేషించండి

Hindu Mythology: సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఆపని చేయకండి, మీ వంశం నాశనమే!

హిందూ ధర్మంలో కొన్ని కార్యాలకు ప్రత్యేకమైన సమయాలుంటాయి, నిషిద్ధ సమయాలూ ఉంటాయి. ఏ సమయం మంచిది కాదో , ఎందుకో కారణం తెలుసుకోకుంటే దానివల్ల దుష్ఫలితాలే ఎక్కువ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కశ్యపుడు, దితిల సంధ్యాసమయ కలయికతో రాక్షసులు జన్మించారు.
  • సంతానం కోరి దితి సంధ్యాసమయంలో కశ్యపుడిని వేడుకుంది.
  • శాస్త్రాలను అతిక్రమించడంతో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టారు.
  • సంధ్యాసమయంలో తప్పు చేస్తే అశుభ ఫలితాలు కలుగుతాయి.

సాయంత్ర సమయంలో ఆమెకు కలిగి కోరిక లోకాలను వణికించింది

సంతానం కోసం పరితపిస్తున్న ఆ ఇల్లాలు..భర్త వారించినా కానీ తనకు పుత్రభిక్ష పెట్టమని వేడుకుంది

అంతా పరమేశ్వరుడిదే భారం అంటూ ఆ మహర్షి..భార్య కోర్కె తీచ్చారు.. 

అందుకు ఫలితం రాక్షస జననం.. 

ఆ రాక్షసులే హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడు..

శ్రీమద్ భాగవతం (3.14 & 3.17 అధ్యాయాలు) ప్రకారం....

కళ-మరీచి మహర్షులకు కలిగిన సంతానం కశ్యప మహర్షి..
ప్రసూతి-దక్షప్రజాపతి తమ కుమార్తెలు 13 మందిని కశ్యపునికి ఇచ్చి వివాహం చేశారు...వారే  దితి, అదితి, అరిష్ట, సురస, ధను, కష్ట, ఇల,తామ్ర, సురభి, ముని, క్రోధవశ, వినత, కద్రు. 

వీరిలో దితి మినహా..మిగిలిన 12 మంది భార్యలకు సంతాన భాగ్యం కలిగింది. అప్పటి నుంచి దితి మనసులో అదే కోరిక ఉండిపోయింది. తాను కూడా అమ్మా అని పిలిపించుకోవాలని తపించింది. రేయి పగలు సంతానం చుట్టూనే సాగేవి ఆమె ఆలోచనలు. పిల్లలు కావాలన్న వాంఛతో ఉన్న దితి..ఓ రోజు కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్లింది. అప్పుడే సంధ్యావందనం పూర్తిచేసి అగ్నికార్య నెరవేర్చి హోమశాల ముందు కూర్చుని ఉన్నారు కశ్యప మహర్షి. ఆ సమయంలో అక్కడకు వచ్చిన దితి తన మనసులో మాట చెప్పింది. స్వామీ నా సవతులు అందరూ గర్భవతులయ్యారు, పిల్లలతో సంతోషంగా ఉన్నారు..నేను మాత్రం సంతానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను..పుత్ర భిక్ష పెట్టండి అని వేడుకుంది. అప్పుడు కశ్యప మహర్షి.. నీ కోర్కె నెరవేర్చేందుకు ఈ సమయం సరికాదన్నారు. 


Hindu Mythology: సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఆపని చేయకండి, మీ వంశం నాశనమే!

సంధ్యాసమయం గడిచేవరకూ ఆగు..ఈ ముహూర్తకాలంలో మన్మథుడికి శత్రువైన శివుడు వృషభ వాహనంపై భూతగణాలతో కలసి విహరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో భార్య-భర్త కలయిక ప్రకృతి విరుద్ధం..అసుర ఆగమనానికి సంకేతం అని వివరించారు. ధర్మాన్ని అతిక్రమించొద్దని చెప్పినా దితి వినే పరిస్థితిలో లేదు. ఇక భార్య కోర్కెను కాదనలేక పరమేశ్వరుడికి నమస్కరించి ఏకాంతసమయాన్ని గడిపారు కశ్యప మహర్షి. ఆ క్షణం తర్వాత తాను ఏం చేసింది? తన భర్త ఏం చెప్పారు? ఇవన్నీ గుర్తుచేసుకుని అపరాధ భావంతో కుంగిపోయింది దితి. పరమేశ్వరా నా అపరాధాన్ని క్షమించు..నా గర్భాన్ని రక్షించు అని వేడుకుంది. 

కొంతకాలానికి దితి గర్భం దాల్చింది. నువ్వు మోహాన్ని జయించలేకపోయావు, సిగ్గూ భయమూ భక్తి విడిచిపెట్టి వ్యామోహానికి లొంగిపోయావు.. అందుకే భూతగణాలచే ప్రేరేపించే ఆ భగవంతుడి అనుచరులే నీకు కుమారులుగా జన్మిస్తారని చెప్పారు. సంపన్నులు, భయంకర కార్యాలు చేసేవారు, మహా బలవంతులు, గర్విష్టులు అయిన నీ సంతానం..భూమికి భారంగా మారి ...చివరకు శ్రీ మహావిష్ణువు చేతిలో అంతమవుతారని చెప్పారు. మన కుమారులు ఎందరికి అపకారం చేసినా ఆ శ్రీహరి చేతిలో మరణించడం అనేది మనకు దక్కిన భాగ్యం అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే నువ్వు చేసిన విపరీతకార్యం వల్లే ఈ దుస్థితి వచ్చింది.. భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించు. మన వంశంతో ఈ ఇద్దరు మాత్రమే రాక్షసులు..ఆ తర్వాత కలిగే సంతానం శ్రీహరి భక్తులే అని సెలవిచ్చారు కశ్యపుడు. హిరణ్య కశిపుడికి జన్మించినవాడే ప్రహ్లాదుడు, ఆ ప్రహ్లాదుడి మనవడే బలి చక్రవర్తి.  

తొమ్మిది నెలలు నిండిన తర్వాత.. ప్రసవ సమయం ఆసన్నమైంది..
భూమి కంపించింది
పర్వతాలు వణికిపోయాయి
సముద్రాలు ఉప్పొంగాయ్
తారలు నేలరాలాయి
దిక్కులు నిప్పులు చిమ్మాయి
అదే క్షణం ఇద్దరు చిన్నారులు జన్మించారు
తనయులను చూసేందుకు వచ్చిన కశ్యప మహర్షి.. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనీ నామకరణం చేసాడు.


Hindu Mythology: సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఆపని చేయకండి, మీ వంశం నాశనమే!

ఆ తర్వాత కథ అందరకీ తెలిసినదే.. హిరణ్యకశిపుడికి జన్మించిన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు.. ఆ భక్తితోనే విష్ణువును ప్రార్థించగా.. నృసింహ అవతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్య కశిపుడిని సంహరిస్తాడు..అది కూడా సంధ్యా సమయమే. 

సంధ్యా సమయం ఎంతో శక్తివంతమైనది. ఈ సమయంలో దైవారాధన చేయాలి కానీ ఎలాంటి వాంఛలకు లోనుకాకూడదు. దైవారాధన, దీపారాధన చేయకపోయినా శృంగార కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. లేదంటే..వంశానికి అప్రతిష్ట తెచ్చే సంతానం, భూమికి భారంగా మారే సంతానం జన్మిస్తారు.

కలియుగంలో జనం మధ్యే తిరుగుతున్న ఇలాంటి రాక్షసులు ఎందరో ఉన్నారు..అందుకే హత్యలు, అత్యాచారాల సంఖ్య పెరిగిపోతోంది.  దేనికైనా సమయం సందర్భం ఉంటుందని పెద్దలు చెప్పేది అందుకే..

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

Frequently Asked Questions

దితి సంతానం కోసం ఎందుకు కోరుకుంది?

దితి తన తోటి భార్యలందరికీ సంతానం కలగడంతో, తాను కూడా అమ్మా అని పిలిపించుకోవాలని తీవ్రంగా కోరుకుంది.

కశ్యప మహర్షి దితి కోరికను ఎందుకు తిరస్కరించారు?

సంధ్యా సమయంలో శృంగారంలో పాల్గొనడం ప్రకృతి విరుద్ధమని, అది అసుర సంతానానికి సంకేతమని కశ్యప మహర్షి వివరించారు.

దితి సంతానం ఎవరు?

దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే ఇద్దరు రాక్షస సంతానం జన్మించారు.

సంధ్యా సమయం ఎందుకు ముఖ్యం?

సంధ్యా సమయం చాలా శక్తివంతమైనది. ఈ సమయంలో దైవారాధన చేయాలి, కోరికలకు లోనుకాకూడదు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Suryavanshi: 15 ఏళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ విజయ రహస్యం ఇదేనా? మీ పిల్లల్లోనూ ఈ ప్రత్యేకత ఉందా?
15 ఏళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ విజయ రహస్యం ఇదేనా? మీ పిల్లల్లోనూ ఈ ప్రత్యేకత ఉందా?
Mrityu Panchak 2026 Date: మృత్యు పంచకం ఎప్పుడు? ఈ తేదీల్లో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో మరో ఐదుగురికి మరణ భయం తప్పదా?
మృత్యు పంచకం ఎప్పుడు? ఈ తేదీల్లో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో మరో ఐదుగురికి మరణ భయం తప్పదా?
Bhagavad Gita Summary: శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సారాంశం మొత్తం 10 పాయింట్స్ లో!
శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సారాంశం మొత్తం 10 పాయింట్స్ లో!
Travel Yoga: మీ మణికట్టుపై ఉండే ఈ గీతలు విదేశీ ప్రయాణం, ఆర్థిక లాభం , విజయాన్ని సూచిస్తాయా?
మీ మణికట్టుపై ఉండే ఈ గీతలు విదేశీ ప్రయాణం, ఆర్థిక లాభం , విజయాన్ని సూచిస్తాయా?
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget