అన్వేషించండి

Tirumala News: గిరిజన తండాల్లో గోవింద నామస్మరణ: 5000 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన TTD!

TTD: గిరిజన ప్రాంతాలు గోవిందనామస్మరణతో మారుమోగనున్నాయి. ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లో 5 వేల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మించేందుకు టీటీడీ శ్రీకారం చుట్టింది

Tirumala : శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గిరిజన ప్రాంతాల్లో 5 వేల  శ్రీ వేంకటేశ్వర స్వాని ఆలయాలు నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి  సమావేశంలో తీర్మానం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులు అరికట్టడంతో పాటూ హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మవ్యాప్తి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఆలయ నిర్మణాలకు శ్రీకారం చుట్టారు. తిరుమల తిరుపతి దేవస్థాన పర్యవేక్షణలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనులు సాగనున్నాయి. ఈ మేరకు నిధుల కొరత లేకుండా శ్రీవాణి ట్రస్ట్‌ నుంచి రూ.175 కోట్లు దేవాదాయ శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించారు.

గిరిజన ప్రాంతాల్లో జనాభా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఇందుకోసం 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నారు. వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు దారిమళ్లాయన్న విమర్శలొచ్చాయ్. ఈ మేరకు పర్యవేక్షణకు వీలుగా దేవాదాయశాఖ ప్రత్యేక పోర్టల్ ను రూపొందించాలని నిర్ణయించింది. ఆలయాల నిర్మాణం ప్రారంభించిన తర్వాత వివిధ దశల్లో ఫొటోస్ అప్లోడ్ చేసేలా పోర్టల్ నిబంధనలు రూపొందించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం కోసం ఒక్కో ఆలయానికి 5 లక్షలు మాత్రమే కేటాయించింది. కూటమి ప్రభుత్వం అక్కడి జనాభా ఆధారంగా నిధులు పెంచింది.

శాశ్వత క్యూలైన్లు నిర్మాణం ( TTD Build Permanent Que lines And Sheds)

మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా క్యూ లైన్లలో భక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించే దిశగా అడుగులువేస్తోంది. సర్వదర్శనం క్యూలైన్లలో రద్దీని తగ్గించేందుకు తిరుమల  ఎంబీసీ ప్రాంతంలో SSD టోకెన్ల ప్రవేశమార్గాన్ని విస్తరించడంతో పాటు, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కొత్త షెడ్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలో రోజుకి దాదాపు 12 వేల నుంచి 16 వేల  SSD టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ టోకెన్లు తీసుకున్న తర్వాత భక్తులు తిరుమల చేరుకుంటారు. ఏటీజీహెచ్ గెస్ట్‌హౌస్ దగ్గర ప్రవేశమార్గం నుంచి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లోకి ప్రవేశించాల్సి వస్తోంది. ఇది చాలా ఇరుగ్గా ఉండడంతో..భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కరించేందుకు ఈ ప్రాంతాన్ని విస్తరించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 4 వేలమంది భక్తులు కూర్చునేలా కొత్తగా ఒక షెడ్ నిర్మిస్తారు..క్యూలైన్ల మార్గాన్ని కూడా విస్తరిస్తారు. అప్పుడు ఎండ, వానకు ఇబ్బందిలేకుండా సేదతీరుతూ భక్తులు ముందుకు వెళ్లొచ్చు. ఇక సర్వదర్శనం శాశ్వత క్యూలైన్లు రింగురోడ్డులో కృష్ణతేజ నుంచి బాటగంగమ్మ ఆలయం వరకు ఉన్నాయి. వీకెండ్ లో రద్దీ ఎక్కువగా ఉంటోంది.  అందుకే బాటగంగమ్మ ఆలయం నుంచి గోగర్భం జలాశయం కూడలి వరకు  12 కోట్ల వ్యయంతో శాశ్వత క్యూలైన్లు నిర్మించాలని TTD నిర్ణయం తీసుకుంది.

కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!

కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?

కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venkateswara Swamy Temple : అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Karuppu OTT : సూర్య 'కరుప్పు' ఓటీటీ డీల్ ఫిక్స్ - రిలీజ్‌కు ముందే రికార్డు ధర?
సూర్య 'కరుప్పు' ఓటీటీ డీల్ ఫిక్స్ - రిలీజ్‌కు ముందే రికార్డు ధర?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Venkateswara Swamy Temple : అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Karuppu OTT : సూర్య 'కరుప్పు' ఓటీటీ డీల్ ఫిక్స్ - రిలీజ్‌కు ముందే రికార్డు ధర?
సూర్య 'కరుప్పు' ఓటీటీ డీల్ ఫిక్స్ - రిలీజ్‌కు ముందే రికార్డు ధర?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
Smriti Mandhana–Palash Muchhal Wedding Row: స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
Embed widget