టీ20 ప్రపంచకప్ చరిత్రలో 111 ఫోర్లతో శ్రీలంక బ్యాటర్ మహేళ జయవర్ధనే టాప్లో ఉన్నాడు. అతని తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ 103 ఫోర్లతో ఉన్నాడు. మరో తొమ్మిది ఫోర్లు కొడితే కోహ్లీ... మహేళ రికార్డును బద్దలు కొడతాడు. ఈ టోర్నీలో ఆడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ 86 ఫోర్లతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ 86 ఫోర్లతో ఐదో స్థానంలో ఉన్నారు. కాబట్టి మహేళ రికార్డు బ్రేక్ అవ్వడం అయితే పక్కా.