రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పార్ధివ దేహానికి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి నివాళులు అర్పించారు. తన అన్న కీరవాణి కుటుంబంతో కలిసి వచ్చిన రాజమౌళి రామోజీ రావు పార్ధివ దేహం వద్ద భావోద్వేగానికి లోనయ్యారు. రామోజీరావును ఉంచిన పెట్టె మీద తన ఆన్చి చాలా సేపు ఎమోషనల్ అయ్యారు. కీరవాణి, రాజమౌళి రామోజీ రావు కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రామోజీరావు తనకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని రాజమౌళి గతంలో అనేక సార్లు ప్రకటించిన. పని మీద నిబద్ధత, ఆయన చూపించే పట్టుదల, క్రమశిక్షణ తనను ఎప్పుడూ మోటివేట్ చేస్తాయని రాజమౌళి తెలిపారు.