ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుందని తెలుస్తోంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద బుధవారం సాయంత్రం నుంచి భక్తులు వేచి ఉన్నారు. తాగునీరు సైతం లేకుండా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భజరంగ దళ్ ఆధ్వర్యంలో తాగునీరు పంపిణీ చేశారు.