అన్వేషించండి

Telangana Congress Rajagopal Reddy: ఎమ్మెల్యేలను కూడగడుతున్న రాజగోపాల్ రెడ్డి - కాంగ్రెస్ అప్రమత్తం - వేటు వేస్తుందా? మంత్రి పదవి ఇస్తుందా?

Rajagopal Reddy: మంత్రి పదవి కోసం రాజగోపాల్ చేస్తున్న రాజకీయంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఆయనపై ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

Congress high command has focused on Rajagopal Reddy Politics: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి పదవి ఆశించిన ఆయన, అది దక్కకపోవడంతో తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. కేవలం అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, ఒకానొక దశలో ఏకంగా ముఖ్యమంత్రి పదవినే సవాల్ చేసే స్థాయికి ఆయన వ్యాఖ్యలు వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి పదవి ఇవ్వకుంటే తానేంటో చూపిస్తానన్నట్లుగా ఆయన చేస్తున్న హెచ్చరికలు పార్టీలో అంతర్గత పోరును వీధికెక్కించాయి.

కొందరు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం

రాజగోపాల్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం కాకుండా, తెరవెనుక పావులు కదుపుతున్నారనే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో ఆయన నిరంతరం చర్చలు జరుపుతున్నారని, అవసరమైతే ఒక వర్గంగా విడిపోయే యోచనలో ఉన్నారని జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తన డిమాండ్లను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న విమర్శలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటి వరకూ పట్టించుకోని హైకమాండ్ 

ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాజగోపాల్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నా, అధిష్టానం ఇప్పటివరకు చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అయితే, ఇప్పుడు పరిస్థితి చేతులు దాటిపోతోందని, ఆయన ఏకంగా ప్రభుత్వాన్ని బలహీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని సంకేతాలు అందడంతో హైకమాండ్ అప్రమత్తమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ వ్యవహారాన్ని ఇప్పటికే కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని అధిష్టానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాజగోపాల్ రెడ్డిని పిలిపించి మాట్లాడతామని, ఆయన అభ్యంతరాలు ఏమిటో తెలుసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక రకంగా రాజగోపాల్ రెడ్డికి ఇస్తున్న చివరి హెచ్చరికగా భావించవచ్చు. సర్దిచెప్పే ప్రయత్నాలు విఫలమైతే, పార్టీ లైన్ దాటి వెళ్తున్న నేతపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమనే సంకేతాన్ని పీసీసీ పంపింది. రాజగోపాల్ రెడ్డిని దారికి తెచ్చేందుకు అధిష్టానం త్వరలోనే ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రానుంది.

రాజగోపాల్ రెడ్డి తెగిస్తారా? 

రాజగోపాల్ రెడ్డి గతాన్ని పరిశీలిస్తే, ఆయన గతంలో కూడా పార్టీని వీడి మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ అదే బాట పడతారా లేక మంత్రి పదవి కోసం ఒత్తిడి తంత్రం మాత్రమే ఉపయోగిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఆయన శాంతించకపోతే, ఆయనపై వేటు వేయడం ద్వారా ఇతరులకు గుణపాఠం చెప్పాలని రేవంత్ రెడ్డి వర్గం భావిస్తోంది.   రాజగోపాల్ రెడ్డి వైఖరి పార్టీకి బలమా లేక బలహీనతా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. సీనియర్ నేతగా ఆయనకున్న బలాన్ని కాపాడుకుంటూనే, ముఖ్యమంత్రి పీఠాన్ని సవాల్ చేసే ధోరణిని అధిష్టానం ఎలా అణచివేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన దారికి రాకపోతే, కాంగ్రెస్ తనదైన శైలిలో ఆయనకు దారి చూపించే అవకాశం మెండుగా ఉంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget