మొబైల్స్ లో మునిగి చదువుకు దూరమవుతున్న పిల్లల్ని దార్లోకి తీసుకురావాలంటే ఇలా చేయండి!
ఏ పిల్లల్ని చూసినా చేతిలో ఫోనే...తినాలన్నా ఫోన్, నిద్రపుచ్చాలన్నా ఫోన్..ఈ పరిస్థితి మారాలంటే ముందుగా తల్లిదండ్రుల్లో మార్పురావాలి. కొన్ని మంచి మంచి అలవాట్లు చేయాలి, నిత్యం చదువుకునే దేవుడి శ్లోకాలు నేర్పించాలి. ముఖ్యంగా మొబైల్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అందుకోసం ఓ సమయం నిర్ధేశించాలి.
పిల్లలను చదువుతో అనుసంధానించడానికి, చదువును ఆసక్తికరంగా మార్చడం ముఖ్యం. రంగురంగుల పుస్తకాలు, చార్ట్లు, కథలు , ఆటల ద్వారా చదివించడం వల్ల పిల్లలకు ఆసక్తి పెరుగుతుంది.. వారు మొబైల్ నుంచి నెమ్మదిగా తమంతట తాముగా దూరమవుతారు.
తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మొబైల్ ఫోన్లలో మునిగిపోతే.. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు ఫోన్ పక్కనపెట్టడం నేర్చుకుంటే పిల్లలు ఫోన్ ఉపయోగించడం తగ్గిస్తారు.
పిల్లలను పదేపదే మందలించడం వల్ల వారి ఆసక్తి , ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. దీనికి బదులుగా, వారి చిన్న చిన్న ప్రయత్నాలను మెచ్చుకుని ప్రోత్సహిస్తే, పిల్లలు చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు.
బహిరంగ ఆటలు, డ్రాయింగ్, పెయింటింగ్, డాన్స్ లేదా సంగీతానికి సంబంధించిన వాటిలో పిల్లలను బిజీగా ఉంచితే వారి దృష్టిని మొబైల్ నుంచి మళ్లించి సృజనాత్మక పనులలో నిమగ్నమయ్యేలా చేయొచ్చు
పిల్లల చదువులను మెరుగుపరచడానికి టీచర్ మరియు తల్లిదండ్రుల పరస్పర సహకారం చాలా అవసరం. క్రమం తప్పకుండా మాట్లాడుకోవడం, పిల్లల పురోగతిని గమనించడం .. సానుకూల మార్గదర్శకత్వం ద్వారా పిల్లలు నెమ్మదిగా మొబైల్ అలవాటు నుంచి బయటపడి చదువుల వైపు మొగ్గు చూపుతారు.