Bandi Sanjay At Medaram Jatara: మేడారంలో మొక్కులు చెల్లించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఘనంగా జరుగుతోంది. లక్షలాదిగా భక్తులు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం తరలివస్తున్నారు.
మేడారంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణలోని ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది.
సమ్మక్క సారక్క అమ్మవారు గద్దెలమీదకి వచ్చారు. అమ్మవారు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. రేపటితో మేడారం జాతర ముగియనుండగా, భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
కరోనా వ్యాప్తి కొనసాగుతున్నందున మేడారం జాతర ప్రారంభానికి 10 రోజుల ముందు నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.