PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు

చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ కండువా కప్పి ప్రధాని నరేంద్ర మోదీని తమ నివాసంలోకి ఆహ్వానించారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్లతో ప్రధాని మోదీ పలు అంశాలపై చర్చించారు. సుమారు గంటకు పైగా అక్కడ గడిపారు.
ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ అనంతరం సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం చంద్రబాబు నివాసంలో సీఎం కుటుంబంతో కలిసి ప్రధాని మోదీ అంతా బాగుండాలని దేవుడ్ని ప్రార్థించారు.
మా కుటుంబానికి ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే సాయంత్రం ఇది. ఈ రోజు మా ఇంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడం మాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తాం. ఎంతో ఆప్యాయత, అనురాగంతో ప్రధాని మోదీ మాతో గడిపిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో ప్రత్యేకమని ఏపీ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్తో మోదీ సరదాగా ముచ్చటించారు.