Narasimhan met KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శ
ABP Desam | 07 Jan 2024 05:53 PM (IST)
1
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శించారు.
2
మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను మాజీ మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్.. కేటీఆర్ తో పాటు ఉన్నారు.
3
బంజారాహిల్స్లోని నందినగర్లో కేసీఆర్ నివాసానికి తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు వెళ్లి, బీఆర్ఎస్ అధినేతతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
4
కేసీఆర్ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు నరసింహన్. ఆయన త్వరగా కోలుకోవాలని నరసింహన్ దంపతులు ఆకాంక్షించారు. తన ఇంటికి వచ్చిన అతిథులకు కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి సంప్రదాయ పద్ధతిలో మర్యాదలు చేశారు.