In Pics: సూపర్ స్టార్ కృష్ణకు సీఎం జగన్ నివాళి - మహేశ్ను ఆలింగనం చేసుకొని పరామర్శ
సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళి అర్పించారు.
ఉదయం 11 గంటలకు హైదరాబాద్ పద్మాలయ స్టూడియోకు చేరుకున్న జగన్ దిగ్గజనటుడి పార్థివదేహాన్ని సందర్శించారు.
ఆయనకు నివాళి అర్పించిన తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీని ఓదార్చారు.
కాసేపు వారితో మాట్లాడారు. సుమారు 15 నిమిషాల పాటు అక్కడ ఉన్న జగన్ తర్వాత తిరుగు పయనమయ్యారు.
కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించే టైంలో నందమూరి బాలకృష్ణ కూడా అక్కడే ఉన్నారు.
మహేష్బాబు, ఆయన ఫ్యామిలీతో మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి బాలకృష్ణకు కూడా పలకరించారు.
ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డితో పలువురు మంత్రులు, పార్టీ లీడర్లు కూడా కృష్ణ భౌతిక కాయానికి అంజలి ఘటించారు.
కృష్ణ తుది శ్వాస విడిచినప్పుడు కూడా సీఎం జగన్ ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు.
తెలుగువారి సూపర్ స్టార్ కృష్ణ అని... ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్ అని కామెంట్ పెట్టారు.
నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు అని అభిప్రాయపడ్డారు.
సీఎం జగన్ వెంట వైఎస్ఆర్ సీపీకి చెందిన పలువురు నాయకులు ఉన్నారు.