శివాలయానికి వెళ్లే భక్తులు ఈ తప్పు చేయకండి!

శివాలయానికి వెళ్లే భక్తులు ఈ తప్పు చేయకండి!
శ్రావణమాసంలో గౌరీ దేవి, వరలక్ష్మీదేవి పూజలతో పాటూ శివారాధనకు అత్యంత విశిష్టత ఉంది. కార్తీకమాసం తర్వాత శ్రావణంలోనే శివాలయాలు భక్తులతో కళకళలాడుతాయి. శివాలయాలకు వెళ్లే భక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో అత్యంత ముఖ్యమైనది మీరు నిల్చునే ప్రదేశం
శివాలయాలలో, శివలింగం ముందు నందిని ప్రతిష్ఠిస్తారు. నంది శివుని ప్రధాన రక్షకుడు , ప్రియమైన శిష్యుడు. శివుని సన్నిధిలో నిరంతరం ఉంటాడు. శైవ సంప్రదాయాల్లో నందికి - శివలింగానికి మధ్య ఉన్న దృష్టి రేఖకు ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యత ఉంది.
దర్శనం చేసుకునేటప్పుడు నందికి, శివలింగానికి మధ్య నేరుగా నిలబడకూడదని నమ్ముతారు, ఎందుకంటే అలా చేయడం వల్ల నందికి శివుని దర్శనం అడ్డుపడుతుంది. అందువల్ల, భక్తులు సాధారణంగా నందికి పక్క నుంచి శివలింగాన్ని దర్శిస్తారు.
సాంప్రదాయం ప్రకారం, మొదట కళ్ళు తెరిచి శివ దర్శనం చేసుకుని, చేతులు జోడించి ప్రార్థించి, ఆ తర్వాత కళ్ళు మూసుకుని కొంతసేపు మహాదేవుడిని ధ్యానించాలి.నంది వలె మనస్సును, దృష్టిని శివునిపై కేంద్రీకరించడమే శృంగ దర్శనం సారాంశం. నంది దృష్టి ఎల్లప్పుడూ శివునిపై ఎలా నిలిచి ఉంటుందో, అలాగే భక్తుని మనస్సు కూడా శివునిపై కేంద్రీకృతమయ్యేలా చేయడానికి ఇలా చేస్తారు.
నంది వలె మనస్సును, దృష్టిని శివునిపై కేంద్రీకరించడమే శృంగ దర్శనం సారాంశం. నంది దృష్టి ఎల్లప్పుడూ శివునిపై ఎలా నిలిచి ఉంటుందో, అలాగే భక్తుని మనస్సు కూడా శివునిపై కేంద్రీకృతమయ్యేలా చేయడానికి ఇలా చేస్తారు.
యోగ సంప్రదాయంలో, ధ్యానం అంటే కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థించడం. ఇది దేవునిపై మీ భక్తిని కేంద్రీకరించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. మీ శ్రద్ధ చెదిరిపోదు.