Tirumala: సెప్టెంబర్ 28 గరుడవాహన సేవ, తిరుమలలో సౌకర్యాల గురించి నేరుగా భక్తులను అడిగి తెలుసుకున్న TTD చైర్మన్, ఈవో
శుక్రవారం రాత్రి ముత్యపు పందిరి వాహనంలో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధులలో పలు గ్యాలరీలలోని భక్తులతో ఛైర్మెన్ , ఈవో మాట్లాడారు.
శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వసతి, రవాణా, కాలినడకన వచ్చే భక్తులకు TTD అందిస్తున్న సౌకర్యాలపై భక్తులతో మాట్లాడారు.
అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని, టిటిడి అందిస్తున్న సేవలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి వారి సూచనల మేరకు సౌకర్యాలు అందిస్తామన్నారు.
28వ తేదీ గరుడ సేవ సందర్భంగా మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులనుఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
గ్యాలరీలలో భక్తులు, పలు కళా బృందాలు టిటిడి ఛైర్మెన్, ఈవోలతో ఫోటోలు దిగారు.
image 8
భక్తుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్న టిటిడి చైర్మెన్, ఈవో
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు