Kanya Puja: నవరాత్రి కన్యా పూజలో ఈ చిన్న తప్పు చేస్తే 9 రోజుల ఉపవాసం, మీ భక్తి వృధా అవుతుంది!
శారదీయ నవరాత్రి 2025 సెప్టెంబర్ 22 న ప్రారంభమై అక్టోబర్ 1 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 2 న దసరా జరుపుకుంటారు. నవరాత్రి తొమ్మిది రోజులలో భక్తులు అమ్మవారి 9 రూపాలను పూజిస్తారు.
నవరాత్రిలో అష్టమి-నవమి పూజల తరువాత కన్యా పూజ చేస్తారు. ఇందులో భాగంగా బాలికలను పూజిస్తారు, వారికి నైవేద్యం సమర్పిస్తారు. వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు
కన్యా పూజ చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వస్తాయి దుర్గా మాత ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. అయితే, ఈ సమయంలో మీరు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి, లేకపోతే నవరాత్రి పూజ ఫలం లభించదు.
నవరాత్రి అష్టమి తిథి సెప్టెంబర్ 30, నవమి తిథి అక్టోబర్ 1న ఉంటుంది. అష్టమి, నవమి తిథులు రెండూ కన్యా పూజకు శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. కన్యా పూజలో, బాలికలందరికీ ఒకే విధమైన బహుమతులు ఇవ్వాలి. అంతరం చూపించకండి
కన్యా పూజలో కన్యలకు నలుపు రంగులో ఉన్న వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. అలాగే తోలు, స్టీల్ లేదా ఇనుముతో చేసిన వస్తువులను కూడా ఇవ్వకూడదు. దీనివల్ల శని, రాహు-కేతు దోషం కలుగుతుంది.
పూజ అనంతరం బాలికలకు భోజనం పెడతారు..అయితే వారిని దేవతా స్వరూపంగా భావించి ఎంత తినగలిగితే అంతే పెట్టండి. తినాలి అని బలవంతం చేయవద్దు. ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. బాలికా పూజ చేసిన స్థలాన్ని పూజ ముగిసిన వెంటనే శుభ్రం చేయకూడదు.