Kamakhya Devi Temple: మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కామాఖ్య దేవి ఆలయ రహస్యం!
కామాఖ్య దేవి మందిరం భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం 52 శక్తి పీఠాలలో ఒకటి. ఇది అస్సాం రాజధాని దిస్పూర్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో నీలాంచల్ పర్వతంపై ఉంది. ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఇక్కడ అమ్మవారి యోనిభాగం పడిందని చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని రహస్య విషయాలు ఉన్నాయి
పురాణాల ప్రకారం విష్ణు భగవానుడు తన చక్రంతో సతిదేవి శరీరాన్ని 51 భాగాలను పడగొట్టాడు.సతిదేవి శరీర భాగం ఎక్కడైతే పడిందో అక్కడ శక్తి పీఠం ఏర్పడింది.ఆ 51 శక్తిపీఠాల్లో కామాఖ్య ఒకటి
కామాఖ్య దేవి ఆలయం జూన్ 22 నుంచి జూన్ 25 వరకు మూడు రోజులు మూసివేస్తారు. ఈ రోజుల్లో అమ్మవారు రజస్వలగా ఉంటుందని నమ్ముతారు. ఈ 3 రోజుల్లో పురుషులు ఆలయంలోకి ప్రవేశించలేరు. ఆలయంలో ఉంచిన తెల్లని వస్త్రం ఈ 3 రోజుల్లో ఎరుపు రంగులోకి మారుతుందని చెబుతారు, ఈ వస్త్రాన్ని అంబుబాచి అంటారు. దీనినే ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు.
ఆలయాన్ని మూడు సార్లు దర్శించుకుంటే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం తంత్ర విద్యకు ప్రసిద్ధి చెందింది. అందుకే సాధువులు, సన్యాసులు కూడా ఇక్కడికి దర్శనానికి వస్తారు.
ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక పెద్ద మేళా జరుగుతుంది, దీనిని అంబుబాచి మేళా అంటారు. ఈ మేళా జూన్ నెలలో జరుగుతుంది. అమ్మవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు ఈ మేళా జరుగుతుంది. ఈ సమయంలో ఎవరినీ గుడిలోకి అనుమతించరు.
ఈ ప్రదేశం తంత్ర సాధనలకు కూడా చాలా ముఖ్యమైనది. ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ ఉంటే, ఆలయంలోని అఘోరీలు తాంత్రికులు నల్ల మాయను తొలగిస్తారని చెబుతారు.