In Pics : హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన కోదండ రాముడు

ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి కోదండరాముడిని దర్శించుకున్నారు.
భక్త జనసందోహంగా మారిన ఒంటిమిట్ట కోదండ రామాలయం పరిసరాలు
రాత్రి 8 గంటలకు హంస వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవ నిర్వహించారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.
హంస పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంటుంది. 'సోహం' భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి 'దాసోహం' అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
హంస వాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ రాముడు
హంస వాహనంపై ఒంటిమిట్ట కోదండ రాముడు