✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Railway Rules Change: టికెట్ బుకింగ్ నుంచి ప్రయాణీకుల చార్ట్ వరకు.. జూలై 01 నుంచి మారిన రైల్వే నిబంధనలు ఇవే!

RAMA   |  01 Jul 2025 05:56 PM (IST)
1

రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మిగిలిన రవాణా మార్గాల కన్నా తక్కువ ధరతో పూర్తయ్యేది. అందుకే లక్షలాది ప్రయాణికులు రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే, జూలై 1, 2025 నుంచి రైలుప్రయాణానికి సంబంధించిన అనేక నిబంధనల్లో ముఖ్యమైన మార్పులు జరిగాయి

2

రైల్వే శాఖ జూలై 1 2025 నుంచి రైలులో ప్రయాణించే విషయంలో కొన్ని మార్పులు చేసింది. దీని ప్రభావం కోట్లాది ప్రయాణికులపై పడుతుంది. అత్యంత ముఖ్యమైన మార్పు తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించింది. ఇకపై ఆధార్ ధృవీకరణ లేకుండా ఏ ప్రయాణికుడూ తత్కాల్ టికెట్ బుక్ చేసుకోలేరు.

3

ఈ నిబంధన ఆన్లైన్ బుకింగ్ లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే, IRCTC వెబ్సైట్ లేదా రైల్ కనెక్ట్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ముందుగా ఆధార్ ప్రమాణీకరణ చేయించుకోవాలి. ఆధార్ ధృవీకరణ తర్వాతే టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

4

ప్రయాణికుల చార్టులు తయారు చేసే నిబంధనలలో కూడా మార్పులు చేశారు. మొదట చార్ట్ రైలు బయలుదేరే 4 గంటల ముందు తయారు చేసేవారు. ఇకపై ఈ సమయాన్ని 8 గంటలకు పెంచారు.

5

రైల్వే ఏసీ కోచ్ వెయిటింగ్ లిస్ట్ పరిమితిని కూడా పెంచింది. మొదట ఏసీ కోచ్‌లో మొత్తం సీట్లలో 25% వరకు వెయిటింగ్ టిక్కెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ పరిమితిని 60%కి పెంచారు. ఉదాహరణకు, ఒక ఏసీ కోచ్‌లో 50 సీట్లు ఉంటే, మొదట 12 వెయిటింగ్ టిక్కెట్లు లభించేవి. ఇప్పుడు 30 వెయిటింగ్ టిక్కెట్లు జారీ చేయవచ్చు.

6

రైల్వే మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్ల ఛార్జీలను కూడా పెంచింది. నాన్-ఏసీ కోచ్లలో కిలోమీటరుకు 1 పైసా , ఏసీ కోచ్లలో కిలోమీటరుకు 2 పైసలు పెంచారు. అయితే ఈ కొత్త ఛార్జీలు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • న్యూస్
  • Railway Rules Change: టికెట్ బుకింగ్ నుంచి ప్రయాణీకుల చార్ట్ వరకు.. జూలై 01 నుంచి మారిన రైల్వే నిబంధనలు ఇవే!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.