CM Jagan Met CJI : విజయవాడలో సీజేఐ చంద్రచూడ్ తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం వైఎస్ జగన్
విజయవాడ నోవాటెల్ హోటల్లో సీజేఐ కలిసి వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేసిన సీఎం వైఎస్ జగన్
మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని సీజేఐ చంద్రచూడ్ విజయవాడకు చేరుకున్నారు.
శుక్రవారం పలు కార్యక్రమాల్లో సీజేఐ పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తొలిసారిగా తిరుమల వేంకటేశ్వర స్వామివారిని, వరాహస్వామి వారిని దర్శించుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డివై చంద్రచూడ్ కు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో(ఎఫ్ఏసి) అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు స్వాగతం పలికారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర ప్రముఖులకు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, 2023 టీటీడీ క్యాలెండర్, డైరీలను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు.
తిరుమలలో సీజేఐ చంద్రచూడ్
సీజేఐ చంద్రచూడ్ కుటుంబంతో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్