✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

In Pics : తిరుమలకు చేరుకున్న శ్రీవిల్లి పుత్తూరు మాలలు, గరుడసేవ నాడు శ్రీవారికి అలంకరణ

ABP Desam   |  30 Sep 2022 09:14 PM (IST)
1

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గరుడసేవ నాడు స్వామి వారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి మాలలు శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నాయి.

2

ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

3

టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో.ధర్మారెడ్డి, తమిళనాడు దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ సెల్లదొరై, విల్లిపుత్తూరు ఆల‌య ఛైర్మన్ రవిచంద్రన్ ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.

4

శ్రీవిల్లి పుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

5

శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీరంగమన్నార్‌ స్వామి వారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామి వారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.

6

తిరుమలకు చేరుకున్న శ్రీవిల్లి పుత్తూరు మాలలు

7

సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి

8

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆంధ్రప్రదేశ్
  • In Pics : తిరుమలకు చేరుకున్న శ్రీవిల్లి పుత్తూరు మాలలు, గరుడసేవ నాడు శ్రీవారికి అలంకరణ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.