✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Chandrababu: సైకిల్ తొక్కుకుంటూ పోతుంది, గ్లాస్ పదునెక్కుతుంది!: నిడదవోలు సభలో చంద్రబాబు ఫైర్

Shankar Dukanam   |  10 Apr 2024 11:47 PM (IST)
1

‘మూడు పార్టీల తరపున సింహ గర్జన మొదలైంది. ప్రజాగళం వినిపిస్తాం. నిడదవోలు జన వారాహిని చూస్తే జగన్ రెడ్డికి నిద్రపట్టక గుండె పగిలిపోవడం ఖాయం. జగన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి నిడదవోలు ప్రజలు సిద్దంగా ఉన్నారు. కూటమిని అడ్డుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే తొక్కుకుంటూ పోతాం’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

2

గ్లాసును పగలగొట్టాలని చూస్తూ గాజు గ్లాసు జగన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకుంటుంది. కమలానికి బురద అంటించాలని చూస్తే..ఆ బురద జగన్ రెడ్డికే అంటుకుంటుంది. మూడుపార్టీల కూటమీ రాష్ట్ర భవిష్యత్తు కోసమే. 2014 లో కలిసి పోరాడాం. ఏన్డీఏకు భేషరతుగా మద్దతు ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. కూటమి కాంబినేషన్ సూపర్ హిట్. మేం అధికారం కోసం కలవలేదు - చంద్రబాబు

3

పవన్ కళ్యాణ్ వృత్తిపరంగా కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని మీ కోసం వచ్చారు. సినిమాల్లో హీరోలను చూశాను. కానీ, పవన్ కళ్యాణ్ నిజజీవితంలో హీరో. ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెట్టారు. కానీ ఏనాడు మడమ త్రిప్పలేదు. ఆటుపోటులకు అలవాటు లేకపోయినా ఎంతో శ్రమించి మీ కోసం నిలబడ్డాడు. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీయే ప్రభుత్వం ఆక్సిజన్‌ ఇచ్చి బతికిస్తుంది - చంద్రబాబు

4

కూటమి అభ్యర్ధులుగా రాజమండ్రి పార్లమెంటుకు పురందేశ్వరీ, నిడదవోలు ఎమ్మెల్యేగా కందుల దుర్గేష్ లు నిలబడ్డారు. వారిని ఆశ్వీర్వదించండి. నిడదవోలులో ఈ ఎలక్షన్ కు తెలుగుదేశం పార్టీ సింబల్ లేదు. అయినా మేం వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. 2014 కూటమిలో కంటే నేడు తక్కువ సీట్లతో బీజేపీ పోటీ చేస్తోంది. జెండాలు వేరైనా అజెండా ఒక్కటే. అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా. - చంద్రబాబు

5

టీడీపీ సింబల్ లేదని అధైర్యపడవద్దు. ఇతర నియోజకవర్గాలలో జనసేన, బీజేపీ సింబల్స్ లేవని అధైర్యపడొద్దు. అధైర్యం చెందితే మనకే నష్టం. జగన్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ ఆక్సిజన్‌లా బ్రతికిస్తుంది. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. రాజధాని కట్టుకోవాలి. ఇండస్ట్రియల్ కారిడార్లు పూర్తిచేసుకోవాలి. ఇవన్నీ నెరవేరాలంటే నరేంద్రమోడీ సహకారం అవసరం. - చంద్రబాబు

6

గాడితప్పిన పరిపాలనను దారిలో పెట్టే శక్తి, యుక్తి ఎన్డీఏ కూటమికి మెండుగా ఉంది. నరేండ్ర మోడి నాయకత్వాలో 2047 కి భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా నిలవబోతోంది. ప్రపంచంలోనే బలమైన ఆర్ధిక వ్యవస్థల్లో దేశం ఒకటో, రెండో స్థానాల్లో ఉండబోతుంది. అటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కూడా వెనకపబకూడదు. దేశంతో పాటు రాష్ట్రం కూడా సూపర్ పవర్ గా ఎదగాలి. అందుకు మీరందరి సహకారం కావాలి. - చంద్రబాబు

7

జగన్ రెడ్డి గొడ్డలి వేటుకు రాష్ట్రంలో బలవ్వన్ని వర్గం లేదు. రైతులు ఎంతో ఆవేదనలో ఉన్నారు. కాలువల్లో పూడికలు తీయలేదు. దీంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో వచ్చిన వరదల్లో రైతులు పంటలు కోల్పోయారు. దేశంలోనే ఎక్కువ రైతాంగ అప్పులు ఉన్న రాష్ట్రంగా ఏపీని దిగజార్చారు. కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉండటం బాధాకరం. - చంద్రబాబు

8

యువతకు ఉద్యోగాలు లేవు. డీఎస్సీ ఇవ్వలేదు. జాబ్ కేలండర్ ఇవ్వలేదు. యువతకు జాబ్ రావాలంటే కూటమి గెలవాలి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తాం. ఆడబిడ్డలు కుటుంబాలను నడిపించుకోవాడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజీల్ ధరలు, కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచలేదు. కానీ నేడు బాదుడే బాదుడు. - చంద్రబాబు

9

జగన్ రెడ్డి అహంకారి. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే ఆయనను సమర్ధించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. నేను అనుకుని ఉంటే 2019 కి ముందు జగన్ రెడ్డి పాదయాత్రలో ఒక్క అడుగు వేసేవాడే కాదు. కానీ, నేడు జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ని విశాఖకు రానివ్వలేదు. మా జీవితంలో చూడనన్ని కేసులు పెట్టారు. నా జీవితంలో బాంబులకే బయపడలేదు. అలాంటిది కేసులకు బయపడతానా? - చంద్రబాబు

10

జగన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నాని చెబుతున్నాడు. సింగిల్ గా కాదు.. జగన్ రెడ్డి శవాలతో వస్తున్నాడు. 2014 లో తండ్రిలేని బిడ్డనంటూ వచ్చాడు. 2019లో బాబాయి లేని బిడ్డనంటూ వచ్చాడు. నేడు వృద్దులకు పెన్షన్లు ఇవ్వకుండా వారు చనిపోతే వారిని అడ్డంపెట్టుని వస్తున్నాడు. శవరాజకీయాలు చేసి లబ్దిపొందాలనుకుంటున్నాడు. జగన్ రెడ్డిని చూసి సొంత పార్టీ ఎమ్మెల్సీలే పారిపోతున్నారు. జగన్ రెడ్డిని చూసి అందరూ పారిపోతున్నారు. - చంద్రబాబు

11

వైసీపీ ఎమ్మెల్సీలు నాలుగేళ్లు పదవీకాలం ఉన్నా బయటకు వస్తున్నారు. మాకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంటూ మనతో కలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్, రామచంద్రయ్య, వంశీ లాంటి వారు బయటకు వచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రలను సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి కేవలం జగన్ రెడ్డే. రాష్ట్రాన్ని సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెదిరెడ్డి లాంటి నలుగురు రెడ్లకు అప్పగించాడు. కూటమి అన్యోన్యంగా ముందుకు వెళుతుంటే జగన్ రెడ్డి కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడు. ఆ చిచ్చులో జగన్ రెడ్డే దగ్ధం అవుతాడు. - చంద్రబాబు

12

బియ్యం, సగం ధరకే దుస్తులు, పక్కా ఇళ్లు, రైతులకు రూ.50 కే హెచ్.పీ పవర్ కరెంటు ఇచ్చారు. దేశంలోనే పేదలకు ఫింఛన్లు ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు ఎన్టీఆర్. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి తరపున హామీ ఇస్తున్నా. - చంద్రబాబు

13

పవన్ కళ్యాణ్ సూచన మేరకు సూపర్ 6 కి బదులు సూపర్ 10 పాయింట్లతో మార్పు చేయాలని చూస్తున్నాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతీ ఒక్కరికీ నెలకు రూ.1500 ఇస్తాం. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు ఇస్తాం. తల్లికి వందనంలో బిడ్డకు రూ.15 వేలు ఇస్తాం. అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే కరెంటు. మెగా డీఎస్పీ ఇస్తాం. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. - చంద్రబాబు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • రాజమండ్రి
  • Chandrababu: సైకిల్ తొక్కుకుంటూ పోతుంది, గ్లాస్ పదునెక్కుతుంది!: నిడదవోలు సభలో చంద్రబాబు ఫైర్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.