TDP Mahanadu: రాజమహేంద్రవరంలో ఘనంగా ముగిసిన టీడీపీ మహానాడు, రెండోరోజు రౌండప్
తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2024లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు.
వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ముఖ్యంగా మినీ మేనిఫెస్టోలో ఆరు కీలక పథకాలను వెల్లడించారు.
నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ పెద్దపీట వేసింది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మ్యానిఫెస్టోలో స్థానం కల్పించారు.
హైదరాబాద్ కు అభివృద్ధి అంటే ఏంటో చూపించింది చంద్రన్నే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్లింది చంద్రన్న అయితే, వెనక్కి తీసుకుని వెళ్లింది జగన్ అని విమర్శించారు.
ఎన్టీఆర్ ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారు అని నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు
చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం జగన్ పెట్రోల్, డీజీల్ ధరలు వంద దాటిందన్నారు లోకేష్
జోరు వానలోనూ నారా లోకేష్..
వర్షం కురుస్తున్నా మహానాడులో అలాగే కూర్చున్న లోకేష్
ఇళ్లు కట్టకపోతే స్థలాలు వెనక్కి ఇవ్వాలని వైసీపీ నేతలు అంటున్నారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టకపోతే వైసీపీ నేతలు వాటిని కొట్టేస్తున్నారు.
ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు. పాపాల పెద్దిరెడ్డి రూ.10 వేల కోట్ల అవినీతి చిత్తూరు జిల్లాలో చూశానని లోకేశ్ అన్నారు
పన్నులు, చార్జీలతో పేదవాళ్లను జగన్ బాదుడేబాదుడు అని లోకేశ్ మండిపడ్డారు. టిడ్కో ఇళ్లు కట్టింది చంద్రబాబు ప్రభుత్వమని అన్నారు
మహానాడులో బాలక్రిష్ణ, అచ్చెన్నాయుడు, చంద్రబాబు
2024లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో చంద్రబాబు మేనిఫెస్టోని ప్రకటించారు.
ప్రపంచానికి తెలుగువారిని పరిచయం చేసింది ఎన్టీఆర్. రాముడు అయినా భీముడు అయినా ఎన్టీఆరే.
ఎన్టీఆర్ అంటే నటనకు ప్రతిరూపం, గ్రంథాలయం, ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం అన్నారు. ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్.
మహానాడులో కాసానితో పార్టీ అధినేత చంద్రబాబు
లోకేష్ తో బాలక్రిష్ణ మాటామంతి
మహానాడు రెండో రోజు బాలక్రిష్ణ