Photos: తిరుపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. స్వాగతం పలికిన సీఎం జగన్
ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు.
రోడ్డు మార్గం గుండా కేంద్ర హోంమంత్రి, సీఎం జగన్ తిరుమలకు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
స్వామి వారి దర్శనం అనంతరం తాజ్ హోటల్లో బస చేసి ఆదివారం మధ్యాహ్నం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు.
ఆదివారం ఉదయం నెల్లూరులోని స్థానిక కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి అమిత్ షా పాల్గొననున్నారు.
సదరన్ జోనల్ సమావేశంలో రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఈ సమావేశంలో పాల్గొనే రాష్టాలకు సంబంధించిన 48 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం మరింత పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి సూచనలు చేయనున్నారు.