US Iran War Updates 2026: మధ్యప్రాచ్యం అట్టుడికిపోతోంది. ఇరాన్, అమెరికా మధ్య సాగుతున్న పోరు ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. అమెరికా వైమానిక దళాలు వరుసగా ఏడో రాత్రి కూడా ఇరాన్‌పై విరుచుకు పడ్డాయి. బాంబుల వర్షం కురిపించాయి. దీంతో పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక సైనిక స్థావరాలను, క్షిపణీ, డ్రోన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా వెల్లడించింది. 

Continues below advertisement

పోటాపోటీగా దాడులు

అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకే ఇరాన్‌పై దాడులు జరుగుతున్నాయి. ఇది ఆరంభం మాత్రమేనని ఇప్పటి వరకు వైమానిక దాడులకు పరిమితమయ్యాయమని ఇంకా దారికి రాకుంటే ఆ దేశంలోనే సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ హెచ్చరించారు. నేరుగా ఇరాన్‌లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తామని వెల్లడించారు. అమెరికా బెదిరింపులకు ఇరాన్ తలొగ్గడం లేదు. అమెరికాను అదే స్థాయిలో ఎదుర్కొంటూ ఎదురు దాడి చేస్తోంది. వారి సైనిక స్థావరాలను నాశనం చేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే జోర్దాన్ వంటి ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. 

ఏడో రోజు అమెరికా భీకర దాడులు

సెంట్‌కామ్‌ నేతృత్వంలో వ్యూహాత్మక దాడి జరుగుతోంది. ముందుగా ఇరాన్ సైనిక బలాన్ని తగ్గించి, వారికి ఉన్న కమాండ్ కంట్రోల్‌ సెంటర్లను ధ్వంసం చేయాలని చూస్తోంది. అందుకే వరుసగా ఏడో రోజు రాత్రి కూడా దాడులు చేసింది. అమెరికా చేసిన దాడుల కారణంగా గల్ఫ్ ప్రాంతమంతా వణికిపోయింది. ఇరాన్ నుంచి బహ్రెయిన్ వరకు చాలా ప్రాంతాల్లో పేలుళ్ల ప్రభావం కనిపించింది. ఏడు రోజులుగా గ్యాప్ లేకుండా చేస్తున్న దాడి కారణంగా హోర్మూజ్ జలసంధి పరిధిలోని ప్రాంతాలు అమెరికా ఆధీనంలోకి వచ్చాయి. 

Continues below advertisement

MQ-9 రీపర్ డ్రోన్ కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటన 

అమెరికా దాడులకు ఇరాన్ దీటుగా బదులిస్తున్నట్టు పేర్కొంది. అమెరికాకు చెందిన MQ-9 రీపర్‌ డ్రోన్ కూల్చివేసినట్టు ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన బుషెహర్‌ పై నిఘా పెట్టినందుకు ఈ కూల్చివేశామని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రోన్ విలువ 285 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఇది కేవలం నిఘా పెట్టడమే కాకుండా, క్షిపణి దాడులు చేయగలదు. ఇరాన్ ప్రకటనపై ఇంకా అమెరికా స్పందించలేదు. అయితే అమెరికాకు చెందిన కీలక వ్యవస్థను నాశనం చేశామని చెప్పడం ద్వారా తమ సైనిక శక్తి ఎంత బలంగా ఉందో ఇరాన్ చెప్పకనే చెప్పింది. 

వైట్‌ హౌస్ వ్యూహం ఏంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంక్షోభంపై అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వైమానిక దాడులతో సరిపెట్టిన అమెరికా ఇకపై ఇరాన్ నియంత్రణలోని భూభాగాల్లోకి అమెరికా సైన్యాన్ని కూడా పంపిస్తామని హెచ్చరించారు. ఇరాన్ అణు పరిశోధన కేంద్రాలు, కీలక చమరు శుద్ధి పరిశ్రమలే లక్ష్యంగా దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్‌ను ఆర్థికంగా నాశనం చేయాలని చూస్తోంది. అప్పుడే దారికి వచ్చి చర్చలకు అంగీకరిస్తుందని ట్రంప్ ప్లాన్. 

ఇరాన్ నుంచి కూడా గట్టి హెచ్చరిక

భూతల దాడులు చేస్తామని చెబుతున్న అమెరికాకు ఇరాన్ సర్వోన్నత నాయకుడి ప్రధాన సలహాదారు మోహ్సెన్‌ రెజాయి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అమెరికా మతిలేని దాడులను మరికొన్ని రోజులు కొనసాగితే ఇరాన్ సైన్యం చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకార చర్యలు ఎలా తీసుకోవాలో తమకు తెలుసని అన్నారు. దీని ప్రభావం కేవలం అమెరికాపైనే కాకుండా దానికి సహకరించిన పొరుగు దేశాలపై కూడా ఉంటుందని అన్నారు. ఇప్పటికే జోర్దాన్ లాంటి దేశాల్లో అమెరికా స్థావరాలపై దాడులు చేశామని గుర్తు చేస్తున్నారు. ఇరు వర్గాల హెచ్చరికలతో పశ్చిమాసియాలో మరికొన్ని రోజులు ఈ బీభత్సం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.