హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు వాణిజ్య లేదా అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని అనుమానించింది. నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా, దాడులను నిరోధించేందుకు ఈ చర్యలు చేపట్టింది.
US Iran conflict:హొర్ముజ్ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
US Iran conflict:హోర్ముజ్ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్స్ను అమెరికా కూల్చివేసింది. ఇదే టైంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సైనిక సామర్థ్యంపై కీలక ప్రకటన చేశారు.

- అమెరికా ఇరాన్ డ్రోన్లు కూల్చి, రాడార్ కేంద్రాలపై దాడి చేసింది.
- ఇరాన్ క్షిపణి దాడులలో భారతీయ పౌరుడు మరణించాడు.
- ట్రంప్ ప్రకారం ఇరాన్ సైనిక శక్తి భారీగా క్షీణించింది.
- స్తంభించిన చర్చలకు, నిధులు విడుదల చేయాలని ఇరాన్ పట్టుబడుతోంది.
US Iran conflict:పశ్చిమాసియా మరోసారి రగులుతోంది. ఓవైపు శాంతి చర్చలు ముసుగు, మరోవైపు బాంబుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. పలు డ్రోన్లను కూల్చేసిన అమెరికా, ఇరాన్ వద్ద ఆయుధాలు భారీగా తగ్గిపోయాయని చెబుతోంది. చర్చల విషయంలో కూడా ఇరాన్ కొన్ని విషయాలు మొండికేస్తోందని ట్రంప్ అభిప్రాయపడతున్నారు.
ఇరాన్ డ్రోన్స్ కూల్చేసిన అమెరికా
శనివారం హోర్ముజ్ జలసంధి సమీపంలో ఉద్రిక్త నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన కనీసం నాలుగు వన్ వే టాక్ డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ బలగాలు కూల్చివేశాయి. ఈ డ్రోన్లు ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలను లేదా అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
'నౌకలకు ముప్పు ఉందని చర్యలు'
దీనికి ప్రతి చర్యగా, అమెరికా కేవలం రక్షణకే పరిమితం కాకుండా, ప్రతీకార దాడులు కూడా చేపట్టింది. ఇరాన్ తీర ప్రాంతంలోని గొరుక్, ఖేష్మ్ఐలాండ్ లోని నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. సముద్ర మార్గంలో నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, మరిన్ని దాడులను నిరోధించేందుకు ఈ చర్యలు తప్పలేదని సెంటకామ్ స్పష్టం చేసింది.
ఈ మధ్య భారతీయ పౌరుడు మృతి
ఈ ఘర్షణలు కేవలం దేశాల మధ్య పరిమితం కావడం లేదు. సామాన్యుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నాయి. ఈ వారం ప్రారంభంలో కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ క్రమంలో కువైట్విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మృతి చెందాడు. కువైట్ తన భూభాగంపైకి వచ్చిన 30 బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్టు ప్రకటించింది. దీనిని హేయమైన ఇరాన్ దురాక్రమణగా అభివర్ణించింది.
ఇరాన్ పని అయిపోయిందన్న ట్రంప్
మరోవైపు మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ సైనిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరాన్ వద్ద 18 శాతం క్షిపణులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ సంఖ్య 21-22 శాతంగా ఉందని పేర్కొన్నారు. అమెరికా దాడుల వల్ల ఇరాన్ డ్రోన్ తయారీ కేంద్రాలు, క్షిపణి లాంచింగ్ ప్యాడ్లు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయని ఆయన స్పష్టం చేశారు." మేము వారి సైన్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం. అయితే ఇంకా కొన్ని క్షిపణులు,డ్రోన్లు ఉన్నాయి. అవి దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కానీ ముందున్న ఉన్న శక్తి ఇప్పుడు లేదు" ని ట్రంప్ చెప్పారు.
'గర్వంతో చేస్తున్నారు'
యుద్ధం జరుగుతున్నా, మరోవైపు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య సైనిక బలం కంటే ఆత్మగౌరవం చుట్టూ తిరుగుతోందని ట్రంప్ అన్నారు. ఇరాన్ నాయకులు చర్చలకు అంగీకరించకపోవడానికి వారి గర్వమే కారణమని, కానీ వారికి మరో మార్గం లేదని చెప్పారు. " వారు బలంగా ఉన్నామని , గర్వంతో ఉన్నారు. వారు ఎప్పుడు చేయమని అనుకున్న పనులను కూడా ఇప్పుడు చేయక తప్పదు. వారికి వేరే దారి లేదు.' అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
అయితే ట్రంప్ ఇరాన్ వాదన మరోలా ఉంది. అమెరికా తమ బిలియన్ల కొద్ది డాలర్ల ఆస్తులను ఫ్రీజ్ చేసిందని, వాటిని విడుదల చేస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని వారు మొండికేస్తున్నారు. ప్రస్తుతానికి చర్చలకు డెడ్లాక్ పడిందని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.
Frequently Asked Questions
అమెరికా ఇరాన్ డ్రోన్లను ఎందుకు కూల్చివేసింది?
ఇరాన్ సైనిక సామర్థ్యంపై ట్రంప్ ఏమని వ్యాఖ్యానించారు?
ఇరాన్ క్షిపణులు 18% మాత్రమే మిగిలి ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా దాడుల వల్ల డ్రోన్ తయారీ కేంద్రాలు, క్షిపణి లాంచింగ్ ప్యాడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఈ ఘర్షణల వల్ల భారతీయ పౌరులు ప్రభావితులయ్యారా?
అవును, ఈ వారం ప్రారంభంలో కువైట్లోని విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించాడు. ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఈ మృతి సంభవించింది.
చర్చలకు ఇరాన్ విధించిన షరతు ఏమిటి?
అమెరికా తమ బిలియన్ల కొద్ది డాలర్ల ఆస్తులను విడుదల చేస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం చర్చలకు డెడ్లాక్ పడిందని చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు






















