Iran Israel War 2026:అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే ఒక పదం మారుమోగుతోంది. అది యుద్ధం. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరుపుతున్న మెరుపు దాడులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో క్షిపణులు కురుస్తుంటే, కీలకమైన చర్చ జరుగుతోంది. అసలు ఒక దేశంపై యుద్ధం ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? అధ్యక్షుడు ట్రంప్‌, రక్షణ మంత్రి పీట్‌హెగ్‌సెత్‌ ఇరాన్ విషయంలో యుద్ధం అనే పదాన్ని బహిరంగంగానే వాడుతున్నారు. కానీ, అమెరికా చట్టాల ప్రకారం ఇది అధికారికంగా యుద్ధమేనా? లేక అధ్యక్షుడి పరిధిలోని సైనిక చర్యనా? అన్న అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. 

Continues below advertisement

అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది? 

అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి ఆ అధికారం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1 ప్రకారం ఏదైనా మరో దేశంపై యుద్ధం ప్రకటించాలంటే హౌస్ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌, సెనేట్‌ రెండింటిలోనూ మెజారిటీ ఓట్లు రావాలి. ఉదాహరణకు 1812లో అమెరికా మొదటిసారి యుద్ధాన్ని ప్రకటించినప్పుడు హౌస్‌లో 79-49 ఓట్లు, సెనేట్‌లో 19-13 ఓట్లు వచ్చాయి.  

అయితే, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌  ప్రకారం, అధ్యక్షుడు అమెరికా సాయుధ దళాలకు కమాండర్‌న్ చీఫ్‌గా వ్యవహరిస్తారు. అంటే దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే లేదా జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడితే, తక్షణమే సైనిక చర్య తీసుకునే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది.  సుప్రీంకోర్టు కూడా ఈ అధికారాన్ని గుర్తించింది. ఇప్పుడు ఇరాన్‌ విషయంలో జరుగుతున్న దాడులు ఈ మాండర్‌ ఇన్‌ చీఫ్‌ అధికారాల కిందకే వస్తాయని వైట్‌ హౌస్‌ వాదిస్తోంది. 

Continues below advertisement

1942 తర్వాత యుద్ధమే ప్రకటించలేదు

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అమెరికా చరిత్రలో కాంగ్రెస్ ఇప్పటి వరకు కేవలం 11 సార్లు మాత్రమే అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించింది. చివరిసారిగా 1942లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ప్రకటన వెలువడింది. మరి ఆ తర్వాత జరిగిన కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం, ఆఫ్గానిస్తాన్, ఇరాన్‌ యుద్ధాల సంగతేంటి అనే సందేహం వస్తుంది. సాంకేతికంగా చూస్తే అమెరికా వీటిని ఎప్పుడూ యుద్ధాలు అని ప్రకటించలేదు. 

భారీ ప్రాణ నష్టం,భారీ స్థాయిలో సైనిక సమీకరణ ఉండటం వల్ల ప్రజలు వీటిి యుద్ధాలు అని పిలుస్తారు. కానీ ఇవన్నీ అధ్యక్షుడి అధికారాల కింద జరిగిన సైనిక సంఘర్షణలు మాత్రమే. 2001లో సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌ తన కమాండర్ ఇన్‌చీఫ్‌ అధికారాలతో దాడులు మొదలుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ అథరైజేషన్ ఫర్ యూజ్‌ ఆఫ్ మిలిటరీ ఫోర్స్‌ అనే తీర్మానాన్ని ఆమోదించి అధ్యక్షుడి చర్యలకు మద్ధతు ఇచ్చింది. 

ఇరాన్ దాడుల సంగతేంటీ?

ప్రస్తుతం ఇరాన్‌పై దాడులు తీవ్రతరమవుతున్న వేళ ఇరాన్‌ కూడా ప్రతీకార చర్యలకు దిగుతోంది. సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ దాడుల వల్ల గల్ఫ్‌ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ మాట్లాడుతూ... ఇది ఇరాన్‌లాంటి సుదీర్ఘపోరాటం కాదు. దీనికి అంతం అంటూ ఉంటుంది అని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్‌ అనుమతి లేకుండా ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం రాజ్యాంగబద్ధమైనా అని కొంతమంది ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. అధ్యక్షుడు తన అధికార పరిధిని అతిక్రమిస్తున్నారా లేక దేశ రక్షణ కోసం ఈ నిర్ణయం తప్పనిసరి అయిందా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కేవలం కమాండర్‌ ఇన్ చీఫ్ అధికారాలతోనే ఈ పోరు ముగిస్తారా లేదా కాంగ్రెస్ ముందుకు వెళ్లి అధికారికంగా యుద్ధం ప్రకటన చేస్తారా అన్నది వేచి చూడాలి.