India Pakistan: గత కొన్నేళ్లుగా భారత ఏజెంట్లు పాకిస్థాన్‌లోకి చొరబడి 30 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చారని లష్కర్-ఎ-తైబాకు చెందిన ఒక కార్యకర్త పేర్కొన్నారు. పాకిస్థాన్ తరచూ భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతుంది, కానీ చాలాసార్లు విఫలమవుతుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ అనేక విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపించి, పాకిస్థాన్‌ను వెనకడుగు వేసేలా చేసింది. ఇప్పుడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక లష్కర్ ఉగ్రవాది వీడియో, పాకిస్థాన్ నిస్సహాయతను మరోసారి బట్టబయలు చేసింది.

Continues below advertisement

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో లష్కర్-ఎ-తైబా కార్యకర్త రిజ్వాన్ హనీఫ్ ప్రసంగిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా భారత ఏజెంట్లు పాకిస్థాన్‌లోకి చొరబడి 30 మందికిపైగా ఉగ్రవాదులను హతమార్చారని అతను ఆరోపిస్తున్నాడు. అతను ఇలా అన్నాడు, "భారత గూఢచార సంస్థలు తమ ఏజెంట్లను పంపాయి. గత కొన్నేళ్లలో 30కిపైగా ఘటనలు జరిగాయి. మనం 'లా ఇలా అల్లాను' అని నమ్మడమే మన ఏకైక నేరం. మనం రాముడిని, ఘనశ్యామ్‌ను నమ్మము."

ఏ నగరాల్లో ఉగ్రవాదులను హతమార్చారో హనీఫ్ తెలిపాడు

గత కొన్ని నెలలుగా, పాకిస్తాన్‌లో ఉగ్రవాద హత్య జరిగినప్పుడల్లా, సోషల్ మీడియాలో "అజ్ఞాత దుండగుడు" అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వస్తోంది. లష్కర్ ఉగ్రవాది హనీఫ్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో తన సోదరులు హత్యకు గురయ్యారని హనీఫ్ చెప్పాడు. అతను పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావల్‌కోట్ నగరాలను పేర్కొన్నాడు. 

లష్కర్ ఎలా ఏర్పడింది?

లష్కర్-ఎ-తైబా (LeT) ఉగ్రవాదులు భారత్‌లో అనేక దాడులు చేశారు. 1980వ దశకంలో పాకిస్థాన్‌లో లష్కర్‌ను హఫీజ్ మహమ్మద్ సయీద్, జాఫర్ ఇక్బాల్, అబ్దుల్లా అజమ్ స్థాపించారు. ఇది సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో ఏర్పడిన ఇస్లామిస్ట్ సంస్థ అయిన మార్కజ్-ఉద్-దావా-వల్-ఇర్షాద్ సైనిక విభాగంగా ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ వైదొలగిన తరువాత, ఈ సంస్థ దృష్టి జమ్మూ, కాశ్మీర్ వైపు మళ్లింది.