Karur stampede Issue Vijay Reaction:  కరూర్ లో తొక్కిసలాట సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత టీవీకే అధ్యక్షుడు  విజయ్ ఒక వీడియో విడుదల చేశారు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని అన్నారు. 5 జిల్లాల్లో ప్రచారం జరిగినప్పుడు జరగని సంఘటన కరూర్‌లో మాత్రమే ఎందుకు జరుగిందని విజయ్ వీడియోలో ప్రశ్నించారు. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. నా హృదయం బాధతో నిండిపోయింది. మేము ఇప్పటికే 5 జిల్లాల్లో ప్రచారం చేశాము. ఇది కరూర్‌లో మాత్రమే ఎందుకు జరుగిందో ..  మిగతా అన్ని చోట్లా ఎందుకు జరగడం లేదో ప్రజలకు తెలుసన్నారు.  కరూర్ ప్రజలు ఏమి జరిగిందో నిజం చెప్పినప్పుడు, దేవుడే వచ్చి చెప్పినట్లేనన్నారు. త్వరలో నిజాలన్నీ బయటపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.  CM సర్, మీకు కోపం ఉంటే లేదా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే, నాపై  తీర్చుకోండి..కానీ కార్యకర్తలపై వద్దని చెప్పారు.   

Continues below advertisement

Continues below advertisement

అత్యంత ఇరుకైన ప్రదేశంలో సభ నిరవహించాలన్న విమర్శలపైనా విజయ్ వీడియోలో స్పందించారు. మేము ఆ స్థలాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటాము, అందుకే అన్ని రాజకీయ కారణాలను పక్కనపెట్టి, ప్రజల భద్రతను మాత్రమే దృష్టిలో ఉంచుకుని, సరైన ప్రదేశాలను ఎంచుకుని, పోలీసు శాఖ నుండి అనుమతి అడుగుతాము. కానీ ఊహించలేనిది జరిగిందన్నారు. 

బాధితుల్ని పరామర్శించకపోవడంపైన వస్తున్న విమర్శలపై స్పందించారు.  తాను కూడా ఒక మనిషినే. చాలా మంది ప్రజలు ప్రభావితమైనప్పుడు నేను ఆ పట్టణాన్ని ఎలా వదిలి వెళ్ళగలను? నేను నిజంగా అక్కడికి తిరిగి వెళ్లాలనుకున్నాను. కానీ నేను అలా వెళితే, అక్కడ ఇతర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకూడదు, కాబట్టి నేను అక్కడికి వెళ్లకుండా ఉండిపోయానని వివరణ ఇచ్చారు. 

ఈ సమయంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన అన్ని కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను ఎంత ఓదార్పు ఇచ్చినా, మీ నష్టాన్ని పూడ్చడానికి అది సరిపోదని నాకు తెలుసు. ఈ సమయంలో, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.  వీలైనంత త్వరగా మిమ్మల్ని కలుస్తాను. ఈ సమయంలో మా బాధను అర్థం చేసుకుని మా తరపున మాట్లాడిన రాజకీయ నాయకులు , స్నేహితులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని విజయ్ తెలిపారు. 

కరూర్‌లో మాత్రమే ఇది ఎందుకు, ఎలా జరిగింది? ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. కరూర్ ప్రజలు నిజం చెప్పినప్పుడు, దేవుడే దిగి వచ్చి వారికి చెప్పినట్లు నాకు అనిపించింది.  మా తప్పు లేదు, అన్ని వాస్తవాలు త్వరలో బయటపడతాయి. మాకు ఇచ్చిన ప్రదేశానికి వెళ్లి మాట్లాడటం తప్ప మా వైపు నుండి వేరే తప్పు లేదు. అయితే, నా పార్టీ కార్యనిర్వాహకులు నా సహచరులపై  ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

సోషల్ మీడియాలో నిజం చెప్పే సహచరులపై కూడా వారు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు.  సిఎం సార్, మీకు కోపం ఉంటే లేదా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యం ఉంటే, మీరు నాపై ఏమి చేయాలనుకుంటే అది చేయండి. కానీ  పార్టీ కార్యకర్తలపై చేయి వేయకండని కోరారు.  నేను ఇంట్లో లేదా పార్టీ కార్యాలయంలో ఒంటరిగా ఉంటానన్నారు.  మా రాజకీయ ప్రయాణం బలం, ధైర్యంతో కొనసాగుతుందని విజయ్ చెప్పారు.