Vantara Case: ఆలయానికి చెందిన ఏనుగుల విషయంలో వంతారా వైల్డ్ లైఫ్ సెంటర్ పై దాఖలైన పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయానికి సంబంధించిన ఏనుగును చట్టబద్ధంగా వంతారా వైల్డ్ లైఫ్ సెంటర్‌కు తీసుకెళ్తే తప్పేమిటని పిటిషనర్లను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వంటరా వైల్డ్‌లైఫ్ సెంటర్ విషయాన్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు, అన్ని చట్టపరమైన నిబంధనలను పాటిస్తే, ఒక వ్యక్తి ఏనుగును ఉంచుకోవాలనుకుంటే అందులో తప్పు లేదని సోమవారం పేర్కొంది. ఈ దశలో ఈ కేసులో ఎటువంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు జారీ చేయలేదు. 

Continues below advertisement

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని వంటారాలోని వైల్డ్ లైఫ్ సెంటర్‌కు వన్యప్రాణులను అక్రమంగా బదిలీ చేస్తున్నారని,  ఏనుగులను చట్టవిరుద్ధంగా బంధిస్తున్నారన్న  ఆరోపణలపై వివరణాత్మక విచారణ కోరుతూ  ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిపై సుప్రీంకోర్టు సిట్ ను నియమించింది.  ఆగస్టు 25న వంతారా వైల్డ్ లైఫ్ సెంటర్ విషయంలో వచ్చిన అభియోగాలను పరిశీలించడానికి సిట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిట్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జె. చలమేశ్వర్, ఉత్తరాఖండ్ , తెలంగాణ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే ,  సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి అనిష్ గుప్తా ఉన్నారు. చట్టపరమైన నిబంధనలను పాటిస్తే   అనుమతించవచ్చని పేర్కొంటూ వంటారా వైల్డ్‌లైఫ్ సెంటర్‌పై సిట్ నివేదిక సమర్పించిది. ఈ నివేదికను సుప్రీంకోర్టు సమీక్షించింది.

జూలైలో కొల్హాపూర్‌లోని ఒక ఆలయం నుండి వంతారాకు అనారోగ్యంతో ఉన్న ఏనుగును తరలించారు. ఈ అంశంపై ప్రత్యేకంగా తాము విచారణ జరపబోమని సుప్రీంకోర్టు పేర్కొంది. “ఒక స్వతంత్ర సంస్థ ఎటువంటి అక్రమాలను కనుగొనలేదు కాబట్టి ఇప్పుడు అనవసరమైన ఆరోపణలు చేయకూడదు” అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 

Continues below advertisement

“ ఎవరైనా ఏనుగును  సంరక్షిచేందుకు తీసుకోవాలనుకుంటే, అతను చట్ట నిబంధనలను జాగ్రత్తగా చూసుకుని ప్రక్రియ పూర్తి చేస్తే , దానిలో తప్పేంటి?” అని సుప్రీంకోర్టు  ప్రశ్నించింది.  ఏనుగులను ఆలయంలో ఉంచుతారు దసరా కోసం, ఊరేగింపుకోసం ఉపయోగిస్తారని గుర్తుచేశారు.  

రిపోర్టు దుర్వినియోగం కాకుండా సుప్రీంకోర్టు హామీ 

 తక్కువ సమయంలో తన నివేదికను సమర్పించినందుకు జస్టిస్ పంకజ్ మిథల్ , జస్టిస్ ప్రసన్న వరలేతో కూడిన ధర్మాసనం సిట్‌ను ప్రశంసించింది. "పూర్తి నివేదికను బహిర్గతం చేయకూడదని మేము కోరుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మాతో వ్యాపార పరమైన పోటీ కలిగి ఉన్నారు. దానిని దుర్వినియోగం చేయవచ్చు" అని పే వంతారా తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టును కోరారు.  కోర్టు అటువంటి దుర్వినియోగాన్ని అనుమతించదని జస్టిస్ మిథల్ హామీ ఇచ్చారు.   

ఆగస్టు 25న కోర్టు ఏర్పాటు చేసిన బృందాన్ని, కేంద్రం 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం, జూ నియమాలు, భారతదేశం , విదేశాల నుండి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను స్వాధీనం చేసుకునే చట్టాలను పాటిస్తుందో లేదో పరిశీలించమని కోరారు. జూలైలో కొల్హాపూర్‌లోని ఒక ఆలయం నుండి వంటారాకు అనారోగ్యంతో ఉన్న ఏనుగును తరలించడంపై వివాదం తర్వాత దాఖలైన రెండు పిటిషన్లను కోర్టు విచారిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయంతీసుకుంది.  సెప్టెంబర్ 12 నాటికి తన నివేదికను సమర్పించాలని బృందాన్ని ఆదేశించారు.