Union Cabinet approves 11718 crore for Census 2027:  భారత ప్రభుత్వం 2027 జనగణనకు 11,718 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఆమోదించింది. ఇది దేశ చరిత్రలో మొదటిసారి పూర్తిగా డిజిటల్‌గా జరిగే సెన్సస్‌గా ఉంటుంది. కుల గణనను కూడా చేస్తారు. కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్   ప్రకటించారు.  సెన్సస్ 2027 మొదటి డిజిటల్ సెన్సస్‌గా ఉంటుంది. ఇది సమాచార సేకరణను సులభతరం చేస్తూ, ఖచ్చితత్వాన్ని పెంచుతుంది అని వైష్ణవ్ పేర్కొన్నారు.   2021  జనాభా గణన కోవిడ్ మహమ్మారి వల్ల ఆలస్యమై, ఇప్పటికీ జరగలేదు. దీంతో 2027లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ సారి జనాభా లెక్కల్లో కుల గణన చేర్చడం ప్రధాన మలుపు . ఇది భారతదేశంలో మొదటిసారి కుల డేటాను సమగ్రంగా సేకరించే అవకాశం.  సెన్సస్ 2027లో కుల గణన భాగంగా ఉంటుంది. ఇది సామాజిక-ఆర్థిక విశ్లేషణలకు ఆధారం అవుతుందని  కేంద్రం చెబుతోంది. డిజిటల్ ఫార్మాట్‌లో ఆన్‌లైన్ టూల్స్, మొబైల్ యాప్‌లు, డేటా ఎంట్రీ సిస్టమ్‌లను ఉపయోగించి సమాచారాన్ని సేకరిస్తారు. ఇది సాంప్రదాయిక పేపర్-బేస్డ్ పద్ధతుల కంటే ఖర్చును తగ్గించి, డేటా ఖచ్చితత్వాన్ని 20-30% పెంచుతుందని అధికారులు అంచనా.   

Continues below advertisement

ప్రశ్నావళి వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలు, సెన్సస్ డేటా యూజర్ల సూచనల ఆధారంగా రూపొందిస్తారు. ఇందులో జనాభా, వృద్ధి రేటు, లింగ నిష్పత్తి, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి సాధారణ డేటా ప్రధానంగా ఉంటాయి.  సెన్సస్ రెండు దశల్లో జరుగుతుంది.  మొదటి దశ (ఫేజ్ I) హౌస్ లిస్టింగ్ ,  హౌసింగ్ సెన్సస్‌గా ఉంటుంది. ఇది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు 30 రోజుల్లో జరుగుతుంది. రెండో దశ (ఫేజ్ II) పాపులేషన్ ఎన్యూమరేషన్ (PE)గా ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. ఈ దశలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సౌకర్యాలకు అనుగుణంగా నిర్వహిస్తారు.  డిజిటల్ ప్లాట్‌ఫామ్ వల్ల రియల్-టైమ్ డేటా అప్‌లోడ్, వెరిఫికేషన్ సులభమవుతాయి. 

Continues below advertisement

సాంప్రదాయ సెన్సస్‌ల కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ, డిజిటల్ టెక్నాలజీ వల్ల దీర్ఘకాలంలో ఖర్చు తగ్గుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ డేటా భవిష్యత్ విధానాలు, రిజర్వేషన్లు, బడ్జెట్ విభజనలకు కీలకం అవుతుంది. ముఖ్యంగా, కుల డేటా OBC, SC/STలకు మరింత ప్రయోజనాలు అందించేలా సహాయపడవచ్చునని భావిస్తున్నారు.