UIDAI hikes Aadhaar update fee : భారతదేశంలో 140 కోట్ల మంది పౌరులకు గుర్తింపు గుర్తుగా ఉన్న ఆధార్ కార్డు అప్‌డేట్ ఫీజుల్లో  మార్పు  చేశారు.  యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అక్టోబర్ 1, 2025 నుంచి  పేరు, చిరునామా, జన్మ తేదీ అప్‌డేట్ ఫీజును రూ.50 నుంచి రూ.75కి, బయోమెట్రిక్ (ఫింగర్‌ప్రింట్, ఐరిస్) అప్‌డేట్ ఫీజును రూ.100 నుంచి రూ.125కి పెంచింది. ఈ మార్పు రెండు దశల్లో అమలవుతుంది. అయితే, 5-7 ఏళ్లు ,15-17 ఏళ్ల మధ్య ఒక్కసారి చేసే బయోమెట్రిక్ అప్‌డేట్‌కు పిల్లలకు ఫీజు మినహాయింపు  పొందుతారు.  

Continues below advertisement

 ఏం మారింది? కొత్త ఫీజు రేట్ల వివరాలు UIDAI అధికారిక ప్రకటన ప్రకారం, ఆధార్ సేవలకు డైరెక్ట్‌గా UIDAI పోర్టల్ ద్వారా అభ్యర్థన చేస్తే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. -  డెమోగ్రాఫిక్ అప్‌డేట్ (పేరు, చిరునామా, జన్మ తేదీ, లింగం మార్పు):   ఇప్పటి వరకూ రూ.50, ఇప్పుడు రూ.75.- బయోమెట్రిక్ అప్‌డేట్ (ఫింగర్‌ప్రింట్, ఐరిస్,  ఫోటో): ఇప్పటి వరకూ  రూ.100, ఇప్పుడు రూ.125.-  డెమోగ్రాఫిక్ + బయోమెట్రిక్ కలిపి: ఇప్పటి వరకూ  రూ.100, ఇప్పుడు రూ.150.

ఈ మార్పు అక్టోబర్ 1, 2025 నుంచి మొదటి దశగా అమలులో ఉంటుంది. రెండో దశలో మరోసారి రేట్లు పెంచే అవకాశం ఉందని UIDAI సూచించింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు (Aadhaar Kendra) ద్వారా చేసే అప్‌డేట్‌లకు ఈ ఫీజులు వర్తిస్తాయి. "ఈ పెంపు సేవా నాణ్యత, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం" అని UIDAI CEO సీతారామ్ ముఖర్జీ చెప్పారు. ఆధార్ అప్‌డేట్‌కు ఆన్‌లైన్‌లో myAadhaar పోర్టల్ ద్వారా QR కోడ్ జనరేట్ చేసి సెంటర్‌కు వెళ్లాలని సూచించారు.

Continues below advertisement

  పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం: ఎవరికి వర్తిస్తుంది?    - 5-7 ఏళ్ల మధ్య ఒక్కసారి చేస్తే: ఉచితం.- 15-17 ఏళ్ల మధ్య ఒక్కసారి చేస్తే: ఉచితం.- ఇతర సందర్భాల్లో: రూ.125.

పిల్లల బయోమెట్రిక్ డేటా మార్పులు సహజమైనవి. వీటిని ఉచితంగా అందించడం ద్వారా పేరెంట్స్‌కు సౌలభ్యం" అని UIDAI ప్రకటించింది.  ఆధార్ కార్డు భారతదేశంలో ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, సబ్సిడీలకు కీలకం. UIDAI ప్రకారం, ప్రతి రోజు లక్షలాది అప్‌డేట్ అభ్యర్థనలు వస్తున్నాయి. గతంలో ఫీజులు 2023లో మార్చారు, కానీ ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్, ఆపరేషనల్ కాస్ట్ పెరగడంతో  మరోసారి పెంచారు. "ఆధార్ డేటా ఖచ్చితత్వం కోసం అప్‌డేట్ చేయడం తప్పనిసరి. కానీ ఫీజు పెంపు పేదలకు భారం కాకుండా చూస్తాం" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.