Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Breaking News: మే 23న ఏపీ, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సినీ, బిజినెస్, స్పోర్ట్స్ ఇతర రంగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం రిఫ్రెష్ చేయండి.
LIVE

Background
Breaking News:భారత్లో సామాన్యుడి రవాణా బడ్జెట్ మరోసారి తలకిందులైంది గత పది రోజుల్లోనే చమురు సంస్థలు మూడోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. శనివారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరల పెంపుతో పెట్రోల్, డీజిల్ రేట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి.
శనివారం చమురు సంస్థలు విడుదల చేసిన ప్రకటన ప్రకారం పెట్రోల్ లీటరుకు 87పైసలు పెరిగింది. డీజిల్ లీటరకు 91పైసలుపెరిగింది. సీఎన్జీ ఢిల్లీలో కిలోకు రూపాయి పెరిగింది. ఇప్పుడు అక్కడ కిలో సీఎన్జీ ధర 91.09రూపాయలుగా ఉంది. గడచిన పది రోజులను గమనిస్తే ఇంధన ధరలు మొత్తంగా లీటర్కు దాదాపు ఐదు రూపాయలు పెరిగాయి.
ఇంధన ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు కారణమవుతున్నాయి. పశ్చిమాశియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెంచుతున్నాయి.
భారత్ తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరిగినప్పుడల్లా దేశీయంగా రేట్లు పెంచక తప్పడం లేదు. గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం, చమురు సంస్థలు ఆ భారాన్ని ప్రజలపై వేయకుండా తామే భరించాయి. 2021-24 మధ్య కాలంలో చమురు సంస్థలు సుమారు 24, 500 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. అలాగనే 2024-25లో ఎల్పీజీ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు సుమారు నలభై వేల కోట్ల భారాన్ని భరించాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో ఇప్పుడు ధరలను పెంచుతున్నట్టు తెలుస్తోంది.
ఈ వరుస ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాదు. డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా,లాజిస్టిక్ ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, పండ్లు, ఇతర సరకుల రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది.మల్టిపుల్ సెక్టార్లలో ఉత్పత్తి వ్యయం పెరిగి ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు.
ప్రస్తుతం ధరలు పెరుగుతున్నప్పటికీ గత నాలుగేళ్లలో భారత్ నాలుగు సార్లు ఇంధన ధరలను తగ్గించిందని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 27న స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు పది రూపాయలు తగ్గించారు. దీని వల్ల డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని దాదాపు సున్నాకి తీసుకొచ్చారు.
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి తగ్గే వరకు ఇంధన ధరల్లో ఈ హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇంధన వనరుల అన్వేషణపై దృష్టి సారించాలని ఇప్పటికే ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
LSG vs PBKS: లక్నో సూపర్ జెయింట్స్ పై 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 197 పరుగుల టార్గెట్ ను 7 వికెట్ల తేడాతో ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రేపు జరిగే మ్యాచ్ ఫలితంపై పంజాబ్ ప్లే ఆఫ్ బెర్త్ ఆధారపడి ఉంటుంది.
KBR Park Fire Accident: కేబీఆర్ పార్క్లో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పార్క్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నట్లు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు






















