Breaking News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!
Breaking News: మే 22న ఏపీ, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సినీ, బిజినెస్, స్పోర్ట్స్ ఇతర రంగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం రిఫ్రెష్ చేయండి.
LIVE

Background
Breaking News: విజయవాడ పటమటలోని వంద అడుగుల రోడ్డులో సినిమాను తలపించే యాక్షన్ సీన్స్ కనిపించాయి. అమ్మాయి కోసం ఇద్దరు యువకులు వార్కు దిగారు. వారి వద్ద ఉన్న థార్ వాహనాలతో రోడ్డుపై పోట్లాడుకున్నారు. ఓం రోహిత్ అనే ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మిగతా వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.
హీరా గోల్డ్ నౌహీరా షేక్ అరెస్టు
హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ను ఈడీ అధికారులు గురుగ్రామ్లో అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, నకిలీ గుర్తింపు కార్డులతో పరారీలో ఉన్న ఆమెను ఎట్టకేలకు పట్టుకున్నారు. 5,600 కోట్ల మేర పెట్టుబడిదారులను మోసం చేసిన ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తరలిస్తున్నారు.
ACB Raids on Medchal Deputy Collector Vamsi Mohan Assets:మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లపై ఏసీబీ రైడ్స్! వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గుర్తింపు!
ACB Raids on Medchal Deputy Collector Vamsi Mohan Assets:మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఏసీబీ నిఘాకు చిక్కారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేరున ఉన్న వందల కోట్ల ఆస్తులను అధికారులు గుర్తించారు. ఏకంగా ఆయనకు చెందిన ఎనిమిది ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఓ రియల్టర్ నుంచి పది ప్లాట్లను గిఫ్ట్ డీడ్గా తీసుకున్నారు. అబ్దుల్లాపూర్మెట్ పిగ్లీపురంలో ఆయన మామపేరున ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించినట్టు కూడా తనిఖీల్లో తేటతెల్లమైంది. పలు ప్రాంతాల్లో ఆర్డీవోగా పని చేసిన వంశీమోహన్ ప్రభుత్వ భూములను కూడా కాజేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి విచారణ చేయాల్సి ఉంది.
Andhra Pradesh Latest News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్తోపాటు మిగతా 9 రాష్ట్రాల్లోని మిగతా 20 స్థానాలకు జూన్ 18న ఎన్నిక జరగనుంది.
ట్రెండింగ్ వార్తలు






















