Rahul Gandhi: బీజేపీ విధానాల వల్ల లక్ష్మీ, సరస్వతి, దుర్గ దూరమయ్యారు: రాహుల్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ, వ్యవసాయ చట్టం, డీమోనిటైజేషన్ నిర్ణయాల వల్ల లక్ష్మీ, సరస్వతి, దుర్గ దూరమయ్యారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల లక్ష్మీ, సరస్వతి, దుర్గ దూరమయ్యారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ, వ్యవసాయ చట్టం, డీమోనిటైజేషన్ నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల గురించి కార్యకర్తలను రాహుల్ ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన నోట్ల రద్దు కారణంగా లక్ష్మి మాత శక్తి పెరిగిందా? తగ్గిందా? అని ప్రశ్నించారు. దీనికి వారు తగ్గిందని సమాధానమిచ్చారు. జీఎస్టీ వల్ల లక్ష్మి అమ్మవారి శక్తి తగ్గిందా? పెరిగిందా? అని మరోమారు ప్రశ్నించగా.. కార్యకర్తలు తగ్గిందని జవాబిచ్చారు. ఇలా వ్యవసాయ చట్టం గురించి కూడా కార్యకర్తలను ప్రశ్నించగా.. తగ్గిందనే బదులిచ్చారు. దీంతో ఈ మూడింటినీ కలిపి రాహుల్ జీఎస్టీ, వ్యవసాయ చట్టం, నోట్ల రద్దు నిర్ణయాల వల్ల లక్ష్మి, దుర్గా అమ్మవార్ల శక్తి తగ్గిందని వ్యాఖ్యానించారు.
భారతదేశంలో ఉన్న ప్రతి విద్యా సంస్థ, కాలేజీ, పాఠశాలల అధిపతుల నియామకంపై కూడా రాహుల్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తులను విద్యా సంస్థల అధిపతులుగా నియమిస్తోందని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీని వల్ల చదువుల దేవతైన సరస్వతి శక్తి తగ్గిందా? పెరిగిందా? అని కార్యకర్తలను ప్రశ్నించారు. దీనికి కూడా వారు తగ్గిందనే బదులిచ్చారు. ఇది భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అని రాహుల్ వ్యాఖ్యానించారు.
राहुल गांधी का बेतुका बयान- ‘सरकार के फैसलों से मां लक्ष्मी, मां सरस्वती और दुर्गा माता की शक्ति घटी' pic.twitter.com/I4x15XuRHv
— Newsroom Post (@NewsroomPostCom) September 10, 2021
రాహుల్ నోట జై మాతా దీ మాట..
రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ జమ్మూకు చేరుకున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆయన ప్రఖ్యాత వైష్ణోదేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు వైష్ణో దేవి అమ్మవారికి జై కొడుతూ.. జై మాతా దీ అని నినదించారు.
#WATCH | Congress leader Rahul Gandhi exhorts party workers to chant 'Jai Mata Di' at office bearers gathering in Jammu city of Jammu and Kashmir pic.twitter.com/DV91VuwgH6
— ANI (@ANI) September 10, 2021
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets