Tamil Nadu: తమిళనాడులో భారీ ప్రమాదం జరిగింది. మధురై జిల్లాలో ఓ ప్రైవేట్ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. 




ఇదీ జరిగింది


ఉసిలంబట్టి సమీపంలో బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. ఇందులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలైనట్లు మదురై ఎస్పీ ధ్రువీకరించారు. పేలుడులో గాయపడిన 10 మందిని జిల్లాలోని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను అమ్మవాసి, వల్లరసు, గోపి, వికీ, ప్రేమగా గుర్తించారు. ఈ బాణసంచా కర్మాగారం వలైయప్పన్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.


విషయం తెలుసుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రాథమిక విచారణ అనంతరం బాణాసంచా ఫ్యాక్టరీ యజమాని వలైయప్పన్ అని పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ జరుగుతోంది.