Bihar Dreaded Sigma Gang: సిగ్మా గ్యాంగ్..ఈ పేరు వినని బీహార్ వాసి ఉండరు. పట్టుమని పాతికేళ్లు కూడా ఉండని ఈ గ్యాంగ్ సోషల్ మీడియాలో తమ అరాచకాలను పోస్టు చేసి.. పాపురలారిటీ సాధించింది.   2022లో ప్రారంభమై, 2024 చివరి నాటికి పోలీసు ఎన్‌కౌంటర్లు, అరెస్టులతో ముగిసిన ఈ గ్యాంగ్ కథ ముగసింది. బిహార్ అండర్‌ వరల్డ్‌లో సిగ్మా గ్యాంగ్‌కు ప్రత్యేకత ఉంది.  15కు పైగా హత్యలు,   బెదిరింపులు, ఆయుధాల దాడులుచేశారు.

Continues below advertisement

2022లో బిహార్‌లోని  నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన యువకులు 'సిగ్మా గ్యాంగ్'ను ఏర్పాటు చేశారు. పాట్నా, నలందా, వైశాలి జిల్లాల్లో ప్రారంభమైన ఈ గ్యాంగ్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి తమను అజేయులుగా చిత్రీకరించుకున్నారు. ఆయుధాలు ప్రదర్శనలు, నేరాల  వీడియోలు, పోలీసులు, రైవల్ గ్యాంగ్‌లపై బెదిరింపులు వంటివి చేసేవారు. 2023 మధ్య నాటికి, ఈ కంటెంట్ ద్వారా సెటిల్మెంట్లు,  లోకల్ వ్యాపారాల నుంచి డబ్బు వసూళ్లు పెరిగాయి. బిహార్ పోలీసు DGP రాజీవ్ మిశ్రా 2023లో ఒక ప్రెస్‌మీట్‌లో, "సిగ్మా గ్యాంగ్ సోషల్ మీడియాను ఉపయోగించి చేసిన ఈ దారుణ చర్యలు బిహార్ నేర చరిత్రలో ఒక్కటి కూడా లేవు; ఇది క్రిమినల్ ఇన్నోవేషన్‌లో కొత్త తక్కువ స్థాయి" అని వ్యాఖ్యానించారు.

గ్యాంగ్ లీడర్ ఒక వీడియోలో, "మేము సిగ్మాలం – మా మృత్యుదండం నుంచి ఎవరూ తప్పించుకోలేరు" అని గొప్పగా ప్రకటించుకున్నాడు. గ్యాంగ్‌లోని ప్రధాన కార్యకలాపాలు బెదిరింపు, హత్యలు, అపహరణలు, ఆయుధాల ట్రాఫికింగ్. ప్రత్యేకంగా 'మృత్యుదండం'  పేరుతో చంపేసే వీడియోలు పోస్టు చేసేవారు.  2022 చివరి నుంచి ప్రారంభమైన ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.  బిహార్‌లో ఈ గ్యాంగ్, సాంప్రదాయ డాన్‌ల నుంచి టెక్-ఎనేబుల్డ్ యూత్ సిండికేట్‌లకు మార్పును తీసుకొచ్చింది. సిగ్మా గ్యాంగ్ లో   5-7 మంది కోర్ మెంబర్లు ఉండేవారు.  15కు పైగా హత్యలు, డజన్ల కొద్దీ కిడ్నాప్‌లకు పాల్పడ్డారు. వీరి దురాగతాలు పెరిగిపోవడంతో 2023 మధ్యలో బిహార్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఏర్పాటు చేసి, SP అర్వింద్ కుమార్ నేతృత్వంలో క్రాక్‌డౌన్ ప్రారంభించింది.            

Continues below advertisement

జూన్ 2023లో ఇద్దర్ని అరెస్టు చేశారు.  నవంబర్‌లో ఇస్లాంపూర్ అడవిలో ఇద్దర్ని ఎన్ కౌంటర్ చేశారు. గత ఏడాది ఏప్రిల్, మేలో   పాట్నా ఔట్‌స్కర్ట్స్‌లో ఫుల్వారీ షరీఫ్ సమీపంలో గ్యాంగ్ లీడర్ రాజన్ రాజ్, ఒక మెంబర్‌ను  కాల్చి చంపారు.   జూన్ 2024 నాటికి గ్యాంగ్ పూర్తిగా కుప్పకూలింది.  సిగ్మా గ్యాంగ్ కథ, బిహార్ నేరాల్లో సోషల్ మీడియా పాత్రను మార్చింది. బీహార్ అంటే అరాచకానికి గుర్తు అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. చిన్న వయసులోనే మాఫియాలుగా మారేందుకు ఇలాంటి వారు చేసే ప్రయత్నాలు..గ్యాంగ్ వార్‌లకు.. ఎన్ కౌంటర్లకు కారణం అయ్యేవి.