Lok Sabha Delimitation 2026 Issue: డీలిమిటేషన్ సెగ - శశిథరూర్ జీతాల లాజిక్కు నారా లోకేష్ కాన్స్టిట్యూషన్ కౌంటర్ - లెక్క సరిపోతుందా!?
Shashi Tharoor Nara Lokesh Twitter: లోక్సభ స్థానాల పెంపుపై శశిథరూర్ వేసిన డ్రైవర్ జీతం లాజిక్కు మంత్రి నారా లోకేష్ రాజ్యాంగబద్ధమైన పాయింట్లతో గట్టి కౌంటర్ ఇచ్చారు.

Nara Lokesh Reply To Shashi Tharoor: భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన యాభై శాతం ఫార్ములాతో త్వరలో జరగనుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, శశిథరూర్ ఒక ఆసక్తికరమైన థాట్ ఎక్స్పెరిమెంట్ తో ట్వీట్ చేశారు. దీనికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దిల్లీ స్థాయి సబ్జెక్ట్ నాలెడ్జ్తో, పక్కా రాజ్యాంగబద్ధమైన పాయింట్లతో ఇంగ్లీష్లోనే ఘాటుగా కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది.
శశిథరూర్ డ్రైవర్ జీతం లాజిక్
ట్విట్టర్ వేదికగా శశిథరూర్ చంద్రబాబును ఉద్దేశించి ప్రస్తావిస్తూ.. "నాయుడు గారు, ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ జీతం రూ. 2 లక్షలు, మీ డ్రైవర్ జీతం రూ. 20 వేలు అనుకుందాం. ఇప్పుడు ఇద్దరికీ 50% జీతం పెంచితే.. మీ జీతం రూ. 3 లక్షలు, డ్రైవర్ జీతం రూ. 30 వేలు అవుతుంది. శాతం పరంగా ఇద్దరికీ సమానంగా పెరిగినా, మీ ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం మునుపటి కంటే చాలా పెరిగిపోతుంది కదా! దక్షిణాది సీఎంల ఆందోళన కూడా ఇదే. యూపీకి 80 ఎంపీలు, కేరళకు 20 ఎంపీలు ఉన్నప్పుడు ఉన్న వ్యత్యాసం.. రేపు సీట్లు పెరిగి 120 వర్సెస్ 30 అయినప్పుడు సమాన నిష్పత్తిలోనే ఉన్నా, సీట్ల సంఖ్య పరంగా ఉత్తరాది బలం భారీగా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని ఆందోళన పరచడం లేదా?" అని ప్రశ్నించారు.
Naidu ji, let’s try a thought experiment. Say your salary is 2 lakhs and your driver’s is 20,000. You announce a 50% increase for everybody. Your salary is now 3 lakhs and your driver’s is 30,000. The percentage or proportional increase is the same — but aren’t you much better… pic.twitter.com/VPLAeMuSOl
— Shashi Tharoor (@ShashiTharoor) June 17, 2026
ఫ్రీజ్కు కాలం చెల్లింది - కాంగ్రెసే బాధ్యురాలు: లోకేష్
శశిథరూర్ ట్వీట్కు నారా లోకేష్ నాలుగు పవర్ఫుల్ పాయింట్లతో సమాధానమిచ్చారు. "డియర్ డాక్టర్ థరూర్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం లోక్సభ స్థానాల కేటాయింపు అనేది జనాభా ప్రాతిపదికనే జరగాలి. 1971 జనాభా లెక్కల ప్రకారం సీట్లను ఫ్రీజ్ చేయడం అనేది తాత్కాలికం మాత్రమే. ఆ గడువు ఈ ఏడాది తో ముగిసిపోతుంది. ఎలాంటి జోక్యం లేకపోతే కొత్త డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల సీట్లు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన మీ కాంగ్రెస్ పార్టీయే ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత వహించాలి" అని లోకేష్ మొదటి పాయింట్గా గుర్తుచేశారు.
1971 నాటి ఇండియా కాదు.. ఎంపీలపై భారం పెరిగింది!
రెండో పాయింట్గా లోకేష్ దేశంలో పెరిగిన జనాభాను ప్రస్తావించారు. "1971 నాటి భారతదేశం వేరు, 2026 నాటి భారతదేశం వేరు. మన జనాభా నాడు 55 కోట్లు ఉంటే, నేడు దాదాపు 146 కోట్లకు చేరింది. కానీ లోక్సభ స్థానాలు మాత్రం అవే ఉన్నాయి. అంటే నాడు ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించిన జనాభా కంటే.. నేడు ఒకే ఎంపీ 2.5 రెట్లు ఎక్కువ మంది పౌరులకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. అందువల్ల పార్లమెంట్ స్థానాల సంఖ్యను పెంచడం అనేది కేవలం రాజకీయ ఎంపిక కాదు, అది ప్రజాస్వామ్య అవసరం" అని లోకేష్ స్పష్టం చేశారు.
ఓటరు సమానత్వ హక్కు.. ఎన్డీయే రక్షణ కవచం!
లోకేష్ తన కౌంటర్లో మూడో మ, అత్యంత కీలకమైన రాజ్యాంగ పాయింట్ను లేవనెత్తారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఒక రాష్ట్ర ఓటరుకు మరో రాష్ట్ర ఓటరు కంటే ఎక్కువ ఓటు విలువ ఉండే హక్కు లేదు. ప్రతి పౌరుడి ఓటు విలువ దేశవ్యాప్తంగా సమానంగా ఉండాలన్నదే రాజ్యాంగ ఆశయం. జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే.. సమాన నిష్పత్తిలో సీట్లు పెంచాలనే ప్రతిపాదనను ఎన్డీయే ప్రభుత్వం తీసుకొస్తోంది. బాధ్యతాయుతంగా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూసేందుకే ఈ నిష్పత్తి ఫార్ములాను వాడుతున్నాం అని లోకేష్ పేర్కొన్నారు.
Dear Dr. Tharoor, a few points here.
— Lokesh Nara (@naralokesh) June 17, 2026
First, Article 81 envisages that seats in the Lok Sabha be allocated on the basis of population. The constitutional freeze linked to the 1971 Census was always temporary and was due to expire in 2026. In the absence of any intervention, a… https://t.co/1gmZb5pGGz
పార్లమెంట్లో ఈక్వేషన్స్ మారవు..
చివరగా శశిథరూర్ చెప్పిన డ్రైవర్ జీతం ఉదాహరణను లోకేష్ తిప్పికొట్టారు. పార్లమెంటరీ ప్రభావం లేదా అధికారం అనేది సభలో జరిగే బిల్లుల ఓటింగ్ పై ఆధారపడి ఉంటుంది. అది సాధారణ మెజారిటీ అయినా, మూడింట రెండు వంతుల మెజారిటీ అయినా సరే.. అన్ని రాష్ట్రాలకు సమాన నిష్పత్తిలో సీట్లు పెంచినప్పుడు, పాత పొలిటికల్ ఈక్వేషన్స్ ఏవీ మారవు. అందరికీ ఒకే నిష్పత్తిలో పెరిగినప్పుడు ఎవరికీ అదనపు ప్రయోజనం గానీ, మైలేజ్ గానీ దక్కదు అని చెప్తూ థరూర్ లాజిక్కు లోకేష్ పక్కా పొలిటికల్ చెక్-మేట్ పెట్టారు.
ట్రెండింగ్ వార్తలు






















