Sansad TV Launched: సంసద్ టీవీ ప్రారంభం.. భారత ప్రజాస్వామ్యంపై మోదీ ప్రశంసలు

ABP Desam Updated at: 15 Sep 2021 07:41 PM (IST)
Edited By: Murali Krishna

సంసద్​ టీవీ ఛానల్​ను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా సంయుక్తంగా ప్రారంభించారు.

సంసద్ టీవీని ప్రారంభం

NEXT PREV

లోక్​సభ టీవీ, రాజ్యసభ టీవీ రెండింటిని కలుపుతూ ఏర్పాటు చేసిన సంసద్ టీవీ ఛానెల్​ నేడు ప్రారంభమైంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కలిసి ఈ ఛానెల్​ను ప్రారంభించారు.







ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ హృదయం లాంటిది. మీడియా.. కళ్లు, చెవులు వంటివి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే -                           వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి











ఏళ్లు గడిచేకొద్ది మీడియా పాత్రలో చాలా మార్పులు వచ్చాయి. సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని మీడియా ముందుకువెళ్తుంది. సంసద్ టీవీ.. ఓటీటీ, సోషల్ మీడియా వేదికల్లోనే కాక యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ఇలాంటి రోజు సంసద్ టీవీ ప్రారంభించడం చాలా మంచి విషయం. ప్రజాస్వామ్యానికి భారత్ అమ్మలాంటిది. ప్రజాస్వామ్యమనేది మనకు జీవధార లాంటిది.                            - నరేంద్ర మోదీ, ప్రధాని


ఉభయ సభల టీవీ ఛానెళ్లను కలుపుతూ సంసద్​ టీవీ ఏర్పాటు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలతో పాటు సమచారాత్మక కథనాలను ఇందులో ప్రసారం చేయనున్నారు.

Published at: 15 Sep 2021 07:38 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.