Sachin Pilot Protest: రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టాడు. గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. ఆయన నిరాహార దీక్షకు కూర్చున్నారు. జైపూర్ లోని షాహీద్ స్మారక్ వద్ద పైలెట్ తన మద్దతుదారులతో కలిసి నిరసన చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లత్ ప్రభుత్వం విఫలం అయిందని ఆయన ఆరోపించారు. 


సచిన్ పైలట్ డిమాండ్ ఏమిటి?



  • బీజేపీ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలి.

  • 45 వేల కోట్ల గనుల కుంభకోణంపై చర్యలు తీసుకోవాలి.

  • ఎన్నికల ముందు ప్రభుత్వం నిజాలు చెప్పాలి.

  • రాజస్థాన్ ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించండి.

  • బీజేపీతో కుమ్మక్కయ్యామని ఆరోపణ

  • ప్రభుత్వ విశ్వసనీయత కోసం విచారణ అవసరం.


ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ రాజకీయ ప్రయాణం



  • 41 ఏళ్ల నుంచి రాజకీయాల్లో

  • 3 సార్లు రాజస్థాన్ సీఎం

  • 5 సార్లు లోక్‌సభ ఎంపీ    

  • వారసత్వంగా వచ్చిన రాజకీయాలు    

  • 3 సార్లు రాష్ట్ర అధ్యక్షుడు       

  • రాహుల్, సోనియా గాంధీకి సన్నిహితుడు


సచిన్ పైలట్‌ల రాజకీయ ప్రయాణం ఇప్పటి వరకు ఎలా ఉంది?



  • 19 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు.

  • రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం

  • 2 సార్లు లోక్‌సభ ఎంపీ

  • మన్మోహన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు

  • రాజకీయాల్లోనే స్థానం సంపాదించుకున్నారు

  • ఒకసారి రాష్ట్ర అధ్యక్షుడు

  • ప్రియాంకకు సన్నిహితుడు



  • 2018లో విజయం సాధించే సమయానికి రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న సచిన్ పైలట్‌ 2020లో కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు.

  • రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

  • గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల మద్దతు లేదు

  • టెక్నోక్రాట్‌లు, యువతలో  మంచి పేరుతున్న వ్యక్తి అనే ట్యాగ్


సచిన్ పైలట్ నుంచి అశోక్ గెహ్లాత్ దూరం ఎందుకు?



  • పైలట్ 2014లో రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 

  • పాత నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదు.

  • 2018లో సీఎం కుర్చీ కోసం పైలట్ గట్టిగా పోరాడారు.

  • పైలట్ 2020లో తిరుగుబాటు చేసేందు ప్రయత్నించారు.

  • తర్వాత పైలట్ కి అవకాశం ఇవ్వలేదు.

  • శాంతిభద్రతలపై తరచూ ప్రకటనలు చేస్తూ ఉన్నారు.


సచిన్ పైలట్ ఒకరోజు నిరాహార దీక్షపై ఏ నాయకుడు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు?



  • గెహ్లత్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పథకాలను అమలు చేసింది: జైరాం రమేష్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి

  • పైలట్‌తో అధినాయకత్వం మాట్లాడాలి: సుఖ్‌జీందర్ రాంధావా, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్

  • సచిన్ పైలట్ ఏ లక్ష్మణ్ రేఖను దాటలేదు: టీఎస్‌ సింగ్‌దేవ్‌, ఆరోగ్యశాఖ మంత్రి, ఛత్తీస్‌గఢ్‌

  • పైలట్ ప్రశ్నలను తప్పనిసరిగా గౌరవించాలి: ప్రతాప్ ఖచరియావాస్, కేబినెట్ మంత్రి, రాజస్థాన్

  • పైలట్ సీఎం కావాలని కలలు కంటున్నారు: అసదుద్దీన్ ఒవైసీ, AIMIM అధ్యక్షుడు

  • పైలట్ ఇప్పుడు రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలి: ఉదిత్ రాజ్, కాంగ్రెస్ నాయకుడు