Medical Miracle: వైద్య వింత - ఐదు రోజుల వ్యవధిలో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి.. ఇది ఎలా సాధ్యమైంది?
Multiple Pregnancy: ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాకు చెందిన అమీనా అనే మహిళ ఐదు రోజుల వ్యవధిలో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. అసలు ఇది వైద్యపరంగా ఎలా సాధ్యమయింది..?

Woman Delivers Four Babies In Five Days: సాధారణంగా కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టేటప్పుడు అందరూ ఒకేసారి లేదా కొన్ని నిమిషాల వ్యవధిలో పుడతారు. కానీ, యూపీలో ఓ మహిళ మాత్రం ఐదురోజుల్లో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. వైద్య శాస్త్ర చరిత్రలో అత్యంత అరుదైన , సవాలుతో కూడుకున్న అద్భుతం మొరాదాబాద్లోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అమీనా అనే 31 ఏళ్ల మహిళ నలుగురు బిడ్డలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మనిచ్చింది. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. మొదటి బిడ్డ మే 9న జన్మించగా, మిగిలిన ముగ్గురు బిడ్డలు ఐదు రోజుల తర్వాత అంటే మే 14న జన్మించారు. అత్యంత హై-రిస్క్ కలిగిన ఇటువంటి కేసుల్లో సాధారణంగా సిజేరియన్ చేస్తారు, కానీ ఈ నలుగురు బిడ్డలు నార్మల్ డెలివరీ ద్వారా పుట్టడం వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది.
ఐదు రోజుల గ్యాప్ ఎలా సాధ్యం?
వైద్య పరిభాషలో దీనిని డిలేడ్ ఇంటర్వల్ డెలివరీ అని పిలుస్తారు. గర్భాశయంలో శిశువులు వేర్వేరు ఉమ్మనీరు సంచులలో ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. మే 8న అమీనాకు నొప్పులు రావడంతో మే 9న మొదటి బిడ్డ పుట్టాడు. అప్పటికి గర్భం కేవలం 7 నెలల లోపే ఉండటంతో, మిగిలిన బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. మొదటి డెలివరీ తర్వాత గర్భాశయ ద్వారం తిరిగి మూసుకుపోయేలా చేసి, మిగిలిన ముగ్గురు బిడ్డలు మరికొంత కాలం గర్భంలోనే ఎదిగేలా పర్యవేక్షించారు. దీనివల్ల శిశువుల ఊపిరితిత్తులు మరికొంత మెరుగుపడే అవకాశం దక్కింది.
కుటుంబం మొండి పట్టు
అమీనా గర్భం దాల్చినప్పటి నుండి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంది. రక్తపోటు, కాలేయ సంబంధిత సమస్యలు ఆమెను వేధించాయి. స్కానింగ్లో నలుగురు పిండాలు ఉన్నాయని తెలిసినప్పుడే, తల్లి ప్రాణాలకు ప్రమాదం ఉందని భావించిన వైద్యులు పిండాల సంఖ్యను తగ్గించడం చేయాలని సూచించారు. అయితే, ఆ దంపతులు మాత్రం నలుగురు బిడ్డలనూ కాపాడుకుంటామని మొండిగా నిలబడ్డారు. వారి నమ్మకం, వైద్యుల నిరంతర పర్యవేక్షణ ఈ అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేశాయి.
నలుగురూ వేర్వేరు సంచుల్లో ఉండటం వల్లే..
ఈ కేసులో మరో కీలకమైన అంశం ఏమిటంటే, నలుగురు శిశువులూ వేర్వేరు ఉమ్మనీరు సంచులలో పెరగడం. దీనివల్ల ఒక బిడ్డ బయటకు వచ్చినప్పుడు మిగిలిన వారి సంచులకు ఎటువంటి నష్టం కలగలేదు. ఒకవేళ అందరూ ఒకే సంచిలో ఉండి ఉంటే, మొదటి బిడ్డతో పాటే అందరూ బయటకు రావాల్సి వచ్చేది లేదా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండేది. ఈ ప్రత్యేకమైన శారీరక నిర్మాణం వల్లే వైద్యులు డెలివరీని వాయిదా వేయగలిగారు.
“कुदरत का करिश्मा या मेडिकल मिस्ट्री? 5 दिन में 4 बच्चों का जन्म!”
— Kumar Anand (@Kumaranand9125) May 16, 2026
Sambhal में एक महिला ने 5 दिन के भीतर 4 बच्चों को जन्म देकर सभी को चौंका दिया। मां और सभी नवजात स्वस्थ बताए जा रहे हैं, मामला चर्चा में। pic.twitter.com/EEkYdBVtmS
వైద్య బృందం ఘనత
తీర్థంకర్ మహావీర్ ఆసుపత్రి వైద్యులు ఈ కేసును ఒక గొప్ప విజయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం తల్లి ,నలుగురు శిశువులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పుట్టినప్పుడు తక్కువ బరువు ఉన్నప్పటికీ, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కిరాణా దుకాణం నడుపుకునే అమీనా భర్త మహమ్మద్ అలీమ్, తమ బిడ్డలను సురక్షితంగా బయటకు తెచ్చిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కేసులు వైద్య శాస్త్రంలో మిరాకిల్స్ గానే నిలిచిపోతాయి.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు






















