Modi Pongal Celebrations: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ ఎల్ మురుగన్ ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు తమిళ సంప్రదాయ దుస్తులతో వచ్చారు. తెల్ల లుంగీ, నల్లకోటుతో సందడి చేశారు.







వేడుకల్లో పాల్గొన్న తరవాత ప్రజల్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా Ek Bharat Shreshtha Bharat నినాదాన్ని ప్రస్తావించారు. ఏక్ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ సూత్రానికి ఈ సంక్రాంతి పండగే నిదర్శనమని వెల్లడించారు. ఈ ఐక్యతే భారత్‌ని ముందుకు నడిపిస్తుందని అన్నారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో Kashi Tamil Sangamam గురించి ప్రస్తావించారు. దేశ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తరవాత జరిగిన సాంస్కృతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. 


"ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌కి నిలువెత్తు నిదర్శనం ఈ సంక్రాంతి పండుగ. ఈ ఐక్యతే  మనల్ని ముందుకు నడిపిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. నిన్న దేశమంతా లోహ్రి పండుగను జరుపుకుంది. ఇప్పుడు మకర సంక్రాంతి వంతు వచ్చింది. ఎప్పుడు ఎవరు ఎలా పండుగ జరుపుకున్నా సరే అందరికీ నా శుభాకాంక్షలు"


- ప్రధాని నరేంద్ర మోదీ






ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.