New York India Day Parade:అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ వీధుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ వైభవాన్ని చాటి చెప్పే ఇండియా డే పే్‌ అత్యంత అట్టహాసంగా సాగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఆగస్టు 16వ తేదీన మన్‌హట్టన్‌లోని మాడిసన అవెన్యూ వేదికగా నిర్వహించిన 44వ వార్షిక ఇండియా డే పరేడ్‌ అపూర్వ జనసందోహం మధ్య సుమారు రెండు లక్షల మంది ప్రేక్షకులు సందర్శకులను ఆకర్షించింది.

Continues below advertisement

భారత 80వ స్వాతంత్య్ర వేడుకలతోపాటు, అమెరికా సంయుక్త రాష్ట్రాల 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరేడ్‌ను హార్ననీ ఇన్ హెరిటేజ్‌ అనే అద్భుతమైన థీమ్‌తో రూపకల్పన చేశారు. ఇది రెండు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని, సంస్కృతుల కలయికను ఆవిష్కరించింది. 

Continues below advertisement

ఈ మహా ప్రదర్శనను న్యూయార్క్‌ స్టేట్‌ గవర్నర్‌ కాథీ హోచుల్‌ పరేడ్‌ను ముందుండి నడిపించారు. వారితోపాటు అమెరికా రాజకీయ ప్రముఖులు, సినీ స్టార్స్‌, టెలివిజన్ రంగానికి చెందిన నటీనటుల ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. హీరోయిన్ పూజాహెగ్డే, నటుడు అడివి శేషు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు భారత టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ ొదిన కామెడీ సీరియల్ తారక్ మెహా కా ఊల్తా చష్మా నటీనటులు ఈ సంబరాల్లో జోష్ నింపారు. 

55 శకటాల ఊరేగింపు 

భారతీయ విభిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ పరేడ్‌లో మొత్తం 55 శకటాలు ప్రదర్శించారు. వివిధ సాంస్కృతిక సంస్థలు, ప్రైవేటు వ్యాపార సంస్థలు, ప్రాంతీయ సంఘాల తరుఫున సిద్ధం చేసిన ఈ శకటాలు మాడిసన్ అవెన్యూలో కనువిందు చేశాయి. అమెరికాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్‌ కూడా ఈ పరేడ్ కోసం ప్రత్యేక శకటాన్ని సిద్ధం చేసి ప్రదర్శనకు తీసుకొచ్చింది. 

ఈ శకటాలతోపాటు రంగురంగుల సంప్రదాయ దుస్తుల ధరించిన విభిన్న మార్చింగ్ బ్యాండ్లు, ప్రాంతీయ కళాకారులు పరేడ్ పొడవునా సాంప్రదాయ జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చేస్తూ పరేడ్ వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చారు. 

నోరూరించే ఫుడ్ ఫెస్టివల్‌ 

పరేడ్ మార్గానికి అనుబంధంగా ఎఫ్‌ఐఏ అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఈస్ట్ 26వ స్ట్రీట్‌లో మాడిసన్, పార్క్ అవెన్యూల మధ్య ఫుడ్ ఫెస్టివల్, సామాజిక అవగాహన కల్పించే కమ్యూనిటీ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో పలు రాష్ట్రాలకు చెందిన వైవిధ్యమైన సంప్రదాయ రుచులు అందుబాటులో ఉంచారు. 

లైవ్‌ సాంస్కృతిక వేదిక పరేడ్ అంతటా ప్రేక్షకులకు నిరంతర వినోదాన్ని పంచింది. మధ్యాహ్నం అంతటా సాగిన ఈ లైవ్‌ ప్రదర్శనలతో శాస్త్రీయ సంగీతం, జానపద గీతాల ఆలాపన, అద్భుతమైన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు కొనసాగాయి.