Trending
Karnataka Covid Guidelines: 'ఇక మాస్కులు తప్పనిసరి- న్యూయర్ వేడుకలపై కూడా ఆంక్షలు'
Karnataka Covid Guidelines: రాష్ట్రంలో మాస్కులు తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Karnataka Covid Guidelines: కేంద్రం కరోనా మార్గదర్శకాలు విడుదల చేయడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా కర్ణాటక (Karnataka) ప్రభుత్వం రాష్ట్రంలో మాస్కు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్- 7 కారణంగా కేసులు ఎక్కువగా నమోదు అవ్వుతుండటంతో మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. అలానే కొత్త సంవత్సరపు వేడుకలు అర్ధరాత్రి ఒంటి గంట వరకే నిర్వహించాలని పబ్బులు, రెస్టారెంట్ల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది.
మళ్లీ
కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమైనదో ప్రపంచమంతా గత రెండేళ్ళలో తెలుసుకుంది. లక్షలాది మంది ప్రజలు కరోనా వైరస్ ధాటికి పిట్టల్లా రాలిపోయారు. అన్ని దేశాల ఆర్దిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశాలు, ప్రజలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన బీఎఫ్ - 7 వ్యాప్తి.. మళ్ళీ ఆందోళనకు గురి చేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోన్న వేళ ఇప్పటికే భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందు జాగ్రత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. తాజాగా కొత్త సంవత్సరపు వేడుకలను దృష్టిలో ఉంచుకొని కర్ణాటక ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.
సీఎం భరోసా
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ సోమవారం మాట్లాడుతూ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దశలవారిగా కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు.