Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Rajinikanth Wife New Platform : రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ 'మక్కల్ మడై' పేరిట కొత్త వేదికను ప్రారంభించారు. ఇది సామాజిక సేవా సంస్థా లేక రాజకీయ అడుగులా అన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Makkal Madai Political Party: తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ మక్కల్ మడై అనే సరికొత్త సామాజిక-రాజకీయ వేదికను ప్రారంభించడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. మక్కల్ మడై అంటే ప్రజల వేదిక అని అర్థం. ఒకవైపు నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం, మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన తరుణంలో లతా రజనీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఏంటి ఈ 'మక్కల్ మడై'?
'మక్కల్ మడై' అనేది ఒక స్వచ్ఛంద , సామాజిక వేదిక. ప్రజల సమస్యలను వినడానికి, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, మరియు వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడటానికి, వారి గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు లతా రాజకనీతాంత్ ప్రకటించారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఇదొక సమిష్టి వేదిక అని, దీనికి ఎలాంటి రాజకీయ రంగు లేదని ఆమె ప్రాథమికంగా వెల్లడించారు.
ఇది రాజకీయ అరంగేట్రమేనా?
లతా రజనీకాంత్ దీనిని కేవలం సామాజిక సంస్థగా అభివర్ణిస్తున్నప్పటికీ, దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో రజనీకాంత్ 'రజనీ మక్కల్ మన్రం' ద్వారా రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించి, చివరి నిమిషంలో ఆరోగ్యం సహకరించక వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆయన భార్య 'మక్కల్ మడై' పేరుతో ప్రజల్లోకి రావడం.. రజనీకాంత్ అభిమానులను మళ్లీ ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నమేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జనీకాంత్కు తమిళనాడులో ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్, అభిమాన గణం ఉన్నారు. 'మక్కల్ మడై' ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతును కూడగట్టి, ఎన్నికల సమయంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి? లేదా ఏ కూటమి వైపు నిలబడాలి? అనే విషయాన్ని శాసించే శక్తిగా ఎదగడానికి లతా రజనీకాంత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
தனி இயக்கம் தொடங்கினார் லதா ரஜினிகாந்த்#apnadu #latharajinikanth #superstar #actor #rajinikanth #makkalmedai #kollywood #tamilnadu pic.twitter.com/C2kPfpI06w
— ABP Nadu (@abpnadu) June 5, 2026
మిత్రపక్షాల సమీకరణాలు - ఎవరికి లాభం?
రజనీకాంత్కు కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల అన్నామలై బీజేపీని వీడి కొత్త ప్రాంతీయ పార్టీ పెడుతున్న తరుణంలో, లతా రజనీకాంత్ ఈ వేదికను ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ఈ సంస్థ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారకపోయినా, ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలకు వ్యతిరేకంగా వచ్చే కొత్త శక్తులకు పరోక్షంగా మద్దతు ఇచ్చేలా రజనీకాంత్ అభిమానులను సిద్ధం చేయడానికి ఈ వేదిక ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు.
Is today some special day in TamilNadu?
— Kasturi (@KasthuriShankar) June 5, 2026
Mrs Latha Rajinikanth announces a people's movement'....
Rather out of the blue. Why now? What purpose? Who is funding? What maatram? Political or social?
Me personally feel the name 'Makkal Medai" sounds like a TV show.
Rajini Sir silent… https://t.co/StYkb5tpKT
ట్రెండింగ్ వార్తలు






















