అన్వేషించండి

Breaking News: ఏపీ రైతులకు అలర్ట్: రేపటి నుంచి APAIMS యాప్ ద్వారా ఎరువుల పంపిణీ!

Top Stories Today | జూన్ 7న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, సినీ, క్రీడా ఇతర రంగాల అప్‌డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Top Stories Today | 

ఏపీ రైతులకు అలర్ట్: రేపటి నుంచి APAIMS యాప్ ద్వారా ఎరువుల పంపిణీ!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని (26) జిల్లాల్లో APAIMS యాప్ ద్వారా యూరియా, డీఏపీ (DAP) ఎరువుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టి, అర్హులైన రైతులకు సక్రమంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చింది.

చేప ప్రసాదం పంపిణీ వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. హైదరాబాద్ పోలీసుల కీలక విజ్ఞప్తి!

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ దృష్ట్యా సోమవారం ఉదయం 6 నుండి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లి వైపు వచ్చే ప్రయాణికులు ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ఉండేందుకు ముందే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో స్కూళ్ల రీఓపెనింగ్ తేదీని పొడిగిస్తూ నిర్ణయం

తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం తేదీలో స్వల్ప మార్పు జరిగింది. రాష్ట్రంలో స్కూళ్లను ఈనెల 12వ తేదీకి బదులుగా, జూన్ 15 నుండి తెరవనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఆ తర్వాత శని, ఆదివారాలు (వారాంతపు సెలవులు) వస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ.. విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం రీఓపెనింగ్ తేదీని పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈనెల 15 (సోమవారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

మూడేళ్ల తర్వాత స్వదేశానికి సురక్షితంగా ఒడిశా మహిళ!

దుబాయ్‌లోని భారత కాన్సులేట్, యూఏఈ అధికారుల సంయుక్త కృషితో ఒడిశాకు చెందిన హస్తా మహానంద ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంది. ఆమెను తిరిగి సొంత ఇంటికి చేర్చడంలో విదేశాల్లోని భారత రాయబార కార్యాలయం కీలక పాత్ర పోషించింది.

హస్తా మహానంద 2019 నుండి ఉపాధి కోసం యూఏఈ (UAE)లో పని చేస్తోంది. అయితే, గత మూడేళ్ల క్రితం ఆమె తన కుటుంబంతో పూర్తిగా సంబంధాలు కోల్పోయింది. ఆమె ఎక్కడుందో, ఎలా ఉందో తెలియకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సాయం చేయాలంటూ భారత అధికారులను ఆశ్రయించారు.

కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టింది. యూఏఈ స్థానిక అధికారుల సహకారంతో ఆమెను గుర్తించి, అవసరమైన ప్రయాణ పత్రాలను సిద్ధం చేసి సురక్షితంగా ఆమె ఇంటికి చేర్చింది. మూడేళ్ల తర్వాత తమ మనిషి క్షేమంగా తిరిగి రావడంతో ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. 

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు.. 564/8 వద్ద డిక్లేర్
ఇండియా, అఫ్గానిస్తాన్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ఆసక్తికరంగా సాగింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 564/8 వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126), ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) సెంచరీలతో చెలరేగగ, రిషభ్ పంత్, సాయి సుదర్శన్ చెరో 81 రన్స్ చేశారు. వాషింగ్టన్ సుందర్ (52) నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గానిస్తాన్ రెండో రోజు 15 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. 

యూజీసీ నెట్ జూన్ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ (UGC NET) జూన్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూన్ 22 నుండి జూన్ 30 వరకు జరగనున్నాయి. మొత్తం 5 రోజుల పాటు 80కి పైగా సబ్జెక్టులకు ప్రతిరోజూ 2 షిఫ్టుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. పరీక్షకు సంబంధించిన సిటీ ఎగ్జామ్ సెంటర్ వివరాలను 8 నుండి 10 రోజుల ముందే ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. దీని ప్రకారం, జూన్ 22న పరీక్ష రాసే అభ్యర్థులు జూన్ 12 నుండి 14 లోపు తమ సిటీ కేటాయింపు వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని కేకే ఓపెన్ కాస్ట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఒకే ఒక్క ప్రయాణికుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఆ ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ ముందు భాగం నుజ్జునుజ్జయింది.


Breaking News: ఏపీ రైతులకు అలర్ట్: రేపటి నుంచి APAIMS యాప్ ద్వారా ఎరువుల పంపిణీ!

డ్రైవర్ సహా ఓ ప్రయాణికుడికి ఎలాంటి ప్రాణ నష్టం కాకపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై బస్సు బోల్తా పడటంతో గంట పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత పోలీసులు బస్సును క్రేన్ సహాయంతో పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

సామాన్యుడిపై మరోసారి ధరల భారం: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో భారత్‌లో సామాన్యులపై మరోసారి ధరల భారం పడింది. చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచాయి. మూడు నెలల వ్యవధిలో గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పెంపుతో ఢిల్లీలో 14 కేజీల సిలిండర్ ధర రూ.913 నుండి రూ.942కు, హైదరాబాద్‌లో రూ.965 నుండి రూ.994కు చేరింది.

 వ్యాపార అవసరాల కోసం వాడే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరలు కూడా గత నాలుగు నెలలుగా నిరంతరం పెరుగుతున్నాయి. ముఖ్యంగా జనవరి నెలలోనే కమర్షియల్ సిలిండర్ ధరపై అత్యధికంగా రూ.111 చొప్పున పెంచారు. ఇలా అటు డొమెస్టిక్, ఇటు కమర్షియల్ సిలిండర్ల ధరలు వరుసగా పెరుగుతుండటంతో అటు సామాన్యుల వంటగది బడ్జెట్‌పై, ఇటు వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఏపీ రాజ్యసభ ఎన్నికలు: అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కొలిక్కి తెచ్చింది. పార్టీ తరఫున పోటీ చేయబోయే ముగ్గురు అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌, చింతకాయల విజయ్‌ల పేర్లను శనివారం ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికలో సోషల్ బ్యాలెన్స్ పాటించడంతో పాటు, పార్టీ పట్ల ఉన్న అంకితభావం, యువతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలకు పెద్దపీట వేసినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం (జూన్ 8న) తమ నామినేషన్  దాఖలు చేయనున్నారు.

రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న మొత్తం 4 రాజ్యసభ స్థానాలకు గాను, కూటమి పొత్తుల ఒప్పందంలో భాగంగా టీడీపీ 3 స్థానాలను, జనసేన పార్టీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇందులో జనసేన కోటాకు కేటాయించిన స్థానంలో ఆ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఇప్పటికే తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ఇదివరకే తమ పూర్తి మద్దతును ప్రకటించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Noida Mamura Village Fire: చార్జింగ్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ - ఐదు అంతస్తుల భవనం బుగ్గి - భారీ ప్రాణనష్టం
చార్జింగ్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ - ఐదు అంతస్తుల భవనం బుగ్గి - భారీ ప్రాణనష్టం
E20 Petrol Problems: E20 పెట్రోల్ విధానంపై దేశవ్యాప్త వ్యతిరేకత - కేంద్రం తొందరపడిందా?
E20 పెట్రోల్ విధానంపై దేశవ్యాప్త వ్యతిరేకత - కేంద్రం తొందరపడిందా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Embed widget