Pahalgam Terror Attack: జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతా షాక్‌కు గురైంది. పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు, కిసాన్ నేత నరేష్ టికాయత్ వ్యాఖ్యలపై గందరగోళం చెలరేగిన తర్వాత, రాకేష్ టికాయత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Continues below advertisement


పహల్గాం ఉగ్రదాడిపై భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ టికాట్ కర్నాల్‌లో మాట్లాడుతూ దేశమంతా దిగులుతో ఉందని, ఈ దాడితో దేశమంతా షాక్‌కు గురైందని, ప్రభుత్వం ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.


'లాహోరి ఉప్పును నిషేధించాలి' 
నరేష్ టికాయత్ వ్యాఖ్యలపై రాకేష్ టికాట్ వివరణ ఇస్తూ మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతున్నారని, అయితే నరేష్ టికాయత్‌కు  అలాంటి ఉద్దేశం లేదని, ప్రభుత్వానికి తమ అండ ఉంటుందని చెప్పుకొచ్చారు. లాహోరి ఉప్పును, మసాలాలను నిషేధించాలని, పాకిస్థాన్ వారిని నలిగిపోయేలా చేయాలని, దేశమంతా ఐక్యంగా ఉందని అన్నారు. వ్యవసాయం, నీటికి సంబంధించిన మా అంతర్గత విషయాలు కొనసాగుతాయి, కానీ ఈ విషయంలో మేము కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్‌గా ఉన్నామని రాకేష్ టికాయత్ అన్నారు.


'చోరుడు పాకిస్థాన్‌లో లేడు, ఇక్కడే ఉన్నాడు'
చౌదరి రాకేష్ టికాయత్‌ మాట్లాడుతూ ఈ ఘటనలో ఎవరికి లాభం జరుగుతోంది, ఎవరు హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారో ఆ ప్రశ్నకు సమాధానం అతనికే తెలుసు అని, ఘటనకు కారకుడు ఆ దొంగలు పాకిస్థాన్‌లో లేరు, ఇక్కడే ఉన్నారని అన్నారు. రాకేష్ టికాయత్‌ వీడియోను ఆయన కుమారుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 


రాకేష్ టికాయత్‌ మాట్లాడుతూ అసలైన విషయంపై ఎవరూ దృష్టి పెట్టలేదని, గ్రామంలో ఏదైనా హత్య జరిగితే ముందు దాని వల్ల ఎవరికి లబ్ధి చేకురుతుందో చూసి వారిని పట్టుకుంటారని అన్నారు. ఈ ఘటనకు కారకుడిని ఎక్కడో వెతికితే లాభంలేద, ఆ దొంగలు మన మధ్యలోనే ఉన్నారు, పాకిస్థాన్‌లో లేరని అన్నారు. 


నరేష్ టికాయత్‌ ఏమన్నారు?
కిసాన్ నేత నరేష్ టికాట్ ఆదివారం మాట్లాడుతూ ఉగ్రదాడికి పాకిస్థాన్‌ను మొత్తంగా నిందిస్తే సరికాదని, కొంతమంది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందుకని అక్కడి ప్రజలందరూ తప్పు అని అనకూడదని, పాకిస్థాన్ నీటిని ఆపడం తప్పు అని, భారతదేశం లేదా పాకిస్థాన్ రైతులకు నీరు ఆగితే నష్టం జరుగుతుందని అన్నారు.